డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ను కలిసేందుకు అల్లు అర్జున్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తనను కలిసేందుకు అల్లు అర్జున్కు అసలు అవకాశం ఇవ్వడం లేదు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల్లో రెండుసార్లు హైదరాబాద్ వచ్చారు. కానీ బన్నీని పవన్ కళ్యాణ్ కలవలేదు. ఆంధ్రాలో జరిగే పుష్ప సక్సెస్ సెలబ్రేషన్స్కు పవన్ను ఆహ్వానించి.. ఫ్యాన్స్ మధ్య గొడవకు ఫుల్స్టాప్ పెట్టాలని పుష్ప యూనిట్ భావిస్తోంది. ఇది కూడా చూడండి: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! కలుస్తారని అందరూ భావించినా.. హైదరాబాద్లో తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకొని.. విజయోత్సవానికి పవన్ రారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ జైలుకి వెళ్తే.. చిరంజీవి, నాగబాబు ఇద్దరూ వారి ఇంటికి వెళ్లి పలకరించి వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ వెళ్లలేదు. ఆ తర్వాత బన్నీ జైలు నుంచి వచ్చిన తర్వాత చిరంజీవి, నాగబాబు ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ను కూడా కలుస్తారని అందరూ భావించారు. కానీ అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ అసలు అవకాశం ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇది కూడా చూడండి: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ పార్టీలో ఉన్న తన మిత్రుడి ప్రచారానికి వెళ్లారు. కానీ పవన్ కళ్యాణ్కు కనీసం మద్దతు కూడా ఇవ్వలేదు. దీంతో మెగా, అల్లు మధ్య వార్ మొదలైంది. అల్లు అర్జున్ ఇలా వెళ్లడం పవన్ ఫ్యాన్స్కి కూడా ఏ మాత్రం నచ్చలేదు. ఇది కూడా చూడండి: సౌత్ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానులకు కూడా సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది. అయితే తాజాగా పుష్ప సినిమా రిలీజ్ సమయంలో నిర్మాతల శ్రేయస్సు కోసం.. సినిమా టికెట్ల రేట్లను పెంపుకు సహకరించారు. దీంతో అల్లు అర్జున్ ఏపీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇది కూడా చూడండి: AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!