రష్మిక ప్రాణాలకు ముప్పు.. కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులకు లేఖలు!

రష్మిక మందన్న ప్రాణాలకు ముప్పు ఉందని కొడవ కులస్థులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ఆమెను రాజకీయాల్లోకి లాగిందని, ఆమె ప్రాణాలకు ముప్పు ఉందంటూ ప్రభుత్వం వెంటనే భద్రత కల్పించాలంటూ కొడవ నేషనల్ కౌన్సిల్ కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులకు లేఖ రాసింది.

New Update
rashmika threat

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రాణాలకు ముప్పు ఉందని కొడవ కులస్థులు ఆందోళన చెందుతున్నారు. అనవసరంగా కాంగ్రెస్ ఆమెను రాజకీయాల్లోకి లాగిందని విమర్శించారు. ఆమె ప్రాణాలకు ముప్పు ఉందంటూ ప్రభుత్వం వెంటనే ఆమెకు భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.  ఈ మేరకు కొడవ నేషనల్ కౌన్సిల్ (CNC) కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులకు లేఖ రాసింది. ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి ఆమెకు తగిన బుద్ధి చెప్తామని బెదిరించిన తెలిసిందే. కర్ణాటక లోని కొడగు ప్రాంతంలో కొడవ వర్గానిదే ఆధిపత్యం. సంప్రదాయ హిందువులైన వీరు కొడవ భాష మాట్లాడతారు. రష్మిక ఈ వర్గానికే చెందినవారు.

Also read :  కన్నప్ప’ నుంచి రొమాంటిక్ సాంగ్.. ముద్దులతో రెచ్చిపోయిన మంచు విష్ణు!

Also read :  ఏపీ రైతులకు శుభవార్త.. ఆ కార్డు లేకపోయినా రూ.20 వేలు..!

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌తో వివాదం 

కాగా  బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు హాజరు కావడానికి రష్మిక నిరాకరించడంతో వివాదం మొదలైంది.  కన్నడ ఇండస్ట్రీ నుంచే రష్మిక ఎదిగిందని ఎమ్మెల్యే రవి అన్నారు.  మూలాలు మర్చిపోవద్దని.. గుణపాఠం చెబుతానని హెచ్చరించారు.  దీంతో ఆయనపై  తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఎమ్మెల్యే రవి మాట మార్చారు. ఎమ్మెల్యే రవి అనంతరం  డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా సినిమా వాళ్లపై మండిపడ్డారు.  సినిమా వాళ్లకు నట్లు, బోల్టులు బిగించాల్సిన అవ‌స‌రం ఉందంటూ కామెంట్స్ చేశారు.  ఇక రష్మిక ఇటీవలే పుష్ప 2, చావా  సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ కొట్టింది. ప్రస్తుతం సికిందర్, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉంది . ఆమె నటించిన చివరి మూడు సినిమాలు రూ. 500 కోట్లు వసూలు చేయడం విశేషం.  

Also read :  సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..వరుసగా మూడు రోజులు...

Also Read :  చూసి నేర్చుకోండి.. విదేశాల్లో సంప్రదాయబద్ధంగా.. జడేజా భార్యపై ప్రశంసలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు