Ramayana: నితీష్ తివారి దర్శత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్ట్ 'రామాయణ' ప్రాజెక్ట్ పై రోజురోజుకూ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సినిమా బడ్జెట్ గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాయి. ఏకంగా రూ. 4000 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నట్లు చెప్పి ఆశ్చర్యపరిచారు. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకూ.. ఇంత భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కలేదని.. 'రామాయణ' చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఏ భారతీయ సినిమా కూడా ఈ ప్రాజెక్ట్ దరిదాపుల్లోకి కూడా రాలేదని తెలిపారు. తరలు మారినా, యుగాలు మారినా రామాయణం ఎప్పటికీ గొప్ప ఇతిహాసమే! అందుకే ప్రపంచమంతా దీనిని చూడాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు తెలిపారు నిర్మాత నమిత్. 'రామాయణం' సినిమాతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని అన్నారు.
🚨Namit Malhotra's #Ramayana budget is $500M or 4000 crores, making it the most expensive Indian film ever made. pic.twitter.com/4LFMvT5L2t
— Redding Cream (@redding_cream_t) July 14, 2025
The Biggest Movie ever in the history of INDIAN CINEMA 🔥
— Sai Pallavi FC™ (@SaipallaviFC) July 14, 2025
Produce Namit Malhotra confirms that #Ramayana Part 1 n Part 2 budget being around 4000 crores ❤️🔥💥@Sai_Pallavi92#RanbirKapoor#Yash#SaiPallavi@niteshtiwari22pic.twitter.com/2q7e8kWz1p
Also Read: Kota Srinivasa Rao: ఆ సూపర్ హిట్ పాట పాడింది 'కోట' నే.. ఈ విషయం మీకు తెలుసా?