Bhairavam: దుమ్మురేపుతున్న ముగ్గురు హీరోలు.. 'భైరవం' నుంచి డుమ్.. డుమారే సాంగ్

మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ భైరవం. అయితే తాజాగా ఈమూవీ నుంచి మరో కొత్త పాటను రిలీజ్ చేశారు. 'డుమ్..డుమారే' అంటూ సందడిగా సాగిన ఈ పాటలో ముగ్గురు హీరోలు స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటను మీరూ చూడండి.

New Update

Bhairavam: మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్  ముగ్గురు హీరోల కాంబోలో రాబోతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా  'భైరవం'.  ఈ చిత్రం మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా మరో కొత్త పాటను రిలీజ్ చేశారు. డుమ్.. డుమారే అంటూ సంక్రాంతి పండగ నేపథ్యంలో  సందడిగా సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాస్ స్టెప్పులతో అలరించారు. శ్రీచరణ్ పాకాల సంగీతంలో  భాస్కర్ భట్ల ఈ పాటకు సంగీతం అందించారు. 

విజయ్ కనకమేడల దర్శకత్వంలో

విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కేకే రాధామోహన్‌   ఈ చిత్రాన్ని  నిర్మించారు. ఆనంది, అదితి శంకర్, దివ్యా పిళ్లై  ఇందులో ఫిమేల్ లీడ్స్ గా నటించారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, ఇతర ప్రచార చిత్రాలు విడుదల చేయగా..  మంచి బజ్ క్రియేట్ చేశాయి. మనోజ్, రోహిత్, శ్రీనివాస్ ముగ్గురి మధ్య స్నేహం, ఎమోషన్స్ , యాక్షన్  ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. 

telugu-news | latest-news | cinema-news | Bhairavam release date | Bhairavam songs

Advertisment
Advertisment
తాజా కథనాలు