/rtv/media/media_files/2025/09/19/og-pawan-2025-09-19-21-37-05.jpg)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ఓజీ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించింది. నైజాంలో సింగిల్ స్క్రీన్స్కు రూ.100, మల్టీప్లెక్స్లకు రూ.150 చొప్పున పెంచుకోవచ్చు. అంతేకాకుండా సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు ప్రదర్శించే స్పెషల్ ప్రీమియర్ షోకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఇందుకు టికెట్ ధర రూ.800కు కూడా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ లో ఓజీ టికెట్స్ రేట్స్ పెంపు..
— Telugu Reporter (@TeluguReporter_) September 19, 2025
స్పెషల్ ప్రీమియర్ షో కు పర్మిషన్.. సెప్టెంబర్ 24 రాత్రి 9గంటలకు స్పెషల్ ప్రీమియర్..
టికెట్ రేట్ 800.. 10రోజుల పాటు టికెట్ రేట్స్ పెంపు..
సింగల్ స్క్రీన్ 100.. మల్టీఫ్లెక్స్ 150.#OGonSept25#OG#PawanKalyanpic.twitter.com/s88T9hoPFR
టికెట్ ధరల పెంచిన ఏపీ సర్కార్
అటు ఓజీ చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే టికెట్ ధరల పెంచింది. సినిమా విడుదలైన తొలి 10 రోజులు (సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు) సాధారణ షోల టికెట్ల ధరలను కూడా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై రూ. 125 అదనంగా పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్లలో ఒక్కో టికెట్పై రూ. 150 అదనంగా పెంచుకోవచ్చు.