BIG BREAKING : ఓజీ సినిమాకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ఓజీ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించింది. నైజాంలో సింగిల్ స్క్రీన్స్‌కు రూ.100, మల్టీప్లెక్స్‌లకు రూ.150 చొప్పున పెంచుకోవచ్చు అని తెలిపింది

New Update
og pawan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ఓజీ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించింది. నైజాంలో సింగిల్ స్క్రీన్స్‌కు రూ.100, మల్టీప్లెక్స్‌లకు రూ.150 చొప్పున పెంచుకోవచ్చు. అంతేకాకుండా సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు ప్రదర్శించే స్పెషల్ ప్రీమియర్ షోకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఇందుకు టికెట్‌ ధర రూ.800కు కూడా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

టికెట్‌ ధరల పెంచిన ఏపీ సర్కార్ 

అటు ఓజీ చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే టికెట్‌ ధరల పెంచింది. సినిమా విడుదలైన తొలి 10 రోజులు (సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు) సాధారణ షోల టికెట్ల ధరలను కూడా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ. 125 అదనంగా పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ. 150 అదనంగా పెంచుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు