Allu Arjun: 'పుష్ప' తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాలపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో 'సైన్స్ ఫిక్షన్' కథతో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన బన్నీ.. మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. మలయాళ దర్శకుడు బేసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఓ సూపర్ హీరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో బన్నీ పాత్ర 90's తరాలకు బాగా సుపరిచితమైన 'శక్తిమాన్', 'సూపర్ మ్యాన్' పాత్రల తరహాలో ఉండబోతుందని సమాచారం.
Also Read: Maldives: మాల్దీవ్స్ టూరిజం అంబాసిడర్ గా కత్రినా.. దీని వెనుక కారణం అదేనా?
అల్లు అరవింద్ నిర్మాతగా
దీనికి సంబంధించి బాసిల్ ఇప్పటికే ఒక గ్రిప్పింగ్, ఇన్నోవేటివ్ కథను బన్నీకి వినిపించారని సినీ వర్గాల్లో టాక్. ఈ ప్రాజెక్ట్ ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ స్వయంగా నిర్మించనున్నారని సమాచారం. అంతర్జాతీయ స్టూడియోలు కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. బాసిల్ జోసెఫ్ ప్రత్యేకమైన కథన శైలిని, అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ ని కలిపి ఒక విజువల్ వండర్ ఈ చిత్రాన్ని రూపొందించాలని భావిస్తున్నారట. 2021లో బాసిల్ జోసెఫ్ తెరకెక్కించిన సూపర్ హీరో ఫిల్మ్ 'మిన్నల్ మురళి' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో బాసిల్- అల్లు అర్జున్ కాంబో ఫ్యాన్స్ ఉత్సాహాన్ని పెంచుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్- అట్లీ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. సైన్స్ ఫిక్షన్ తరహాలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే దీపికను ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తూ చిత్ర బృందం వీడియో కూడా రిలీజ్ చేసింది.
Also Read: Manchu Lakshmi: షాకింగ్.. ఎయిరిండియా విమానంలో నటి మంచు లక్ష్మి.. వీడియో వైరల్