బాలయ్య బాబు ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. ఏడాదికి ఒకటి చొప్పున సినిమా తీసి ఫ్యాన్స్లో ఫుల్ జోష్ నింపుతున్నాడు. ఈ ఏడాది మాత్రం ఒక్క సినిమా కూడా తీయలేదు. ముఖ్యంగా ఈ ఏడాది ఏపీ ఎలక్షన్లపై ఫోకస్ పెట్టడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మళ్లీ ఫామ్లోకి వచ్చాడు.
Also Read: Mohan Babu: హైకోర్టుకు మోహన్ బాబు!
వరుస పెట్టి సినిమాలను లైన్లో పెట్టాడు. బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇది వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో బాలయ్య లుక్ అదిరిపోయింది.
Also Read : 'కూలీ' కోసం బరిలోకి దిగిన బాలీవుడ్ స్టార్..!
అంతేకాకుండా బాలయ్య డైలాగ్స్ సినీ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఉర్రూతలూగించాయి. రిలీజ్ అయిన ఆ టీజర్కు విపరీతమైన రెస్పాన్స్ సైతం వచ్చింది. దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు బాలయ్య ‘అఖండ 2’ కూడా మొదలు పెట్టేశాడు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
The protector of Dharma will rage a powerful battle 🔱#Akhanda2 - Thaandavam shoot begins 💥💥
— 14 Reels Plus (@14ReelsPlus) December 11, 2024
Grand release worldwide for Dussehra on SEPTEMBER 25th, 2025 ❤🔥
▶️ https://t.co/l2WnhFjwRj
'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @14ReelsPlus… pic.twitter.com/oZeJPHNwQR
Also Read : మంచు ఫ్యామిలీకి మీడియా అంటే చులకనా? గతంలోనూ చాలాసార్లు
అఖండ 2 రిలీజ్ డేట్ అనౌన్స్
అప్పటి వరకు ఎలాంటి హిట్లు లేక సతమతమవుతున్న బాలయ్యకు ‘అఖండ’ మూవీ ఆకలి తీర్చింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ‘అఖండ 2’ మూవీని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ మేరకు కీలక అప్డేట్ వదిలారు.
Also Read : మోదీతో కపూర్ ఫ్యామిలీ.. కరీనా చేసిన పనికి అంతా షాక్!
ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్గా ప్రకటించారు. వచ్చే ఏడాది దసరా కానుకంగా సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా అఖండ 2 చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఓ ప్రోమో సైతం రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలయ్య కూతురు తేజస్వీని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ అచంట - గోపీ అచంట కలిసి 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై బారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.