బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం 'సితారే జమీన్ పర్' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్ ఖాన్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. నెక్స్ట్ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్తో కలిసి సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. అంతేకాదు ఇది ఒక సూపర్ హీరో కథాంశంతో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్న ఈ ప్రాజెక్ట్ 2026లో ప్రారంభం కానుంది. అమీర్ ఖాన్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
సూపర్ హీరో కథ
అయితే లోకేష్ కానగరాజ్ గతంలో ఈ సూపర్ హీరో కథను సూర్యతో చేయాలని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల చేత అది కుదరలేదని సమాచారం. ఇప్పుడు అదే కథతో ఆమిర్ ఖాన్తో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఏదేమైనా ఈ క్రేజీ కాంబో కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు అమీర్ రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా 2026లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.
#AamirKhan:
— AmuthaBharathi (@CinemaWithAB) June 5, 2025
"#LokeshKanagaraj and I'm working on a film. It belongs to the superhero genre. It’s a big-scale action film and will go on floors in the second half of 2026"
So LokeshKanagaraj's next immediate film after #Kaithi2 will be this film💥. Likely it's #IrumbuKaiMayavi… pic.twitter.com/25IImCdrEn
ఇదిలా ఉంటే ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వస్తున్న "కూలీ" సినిమాలో ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్ష్ణ పనుల్లో బిజీగా ఉన్న 'కూలీ' చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.
Also Read: Shine Tom Chacko: ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ప్రముఖ నటుడి కారు.. తండ్రి దుర్మరణం!