Chinta Mohan: మెగాస్టార్ చిరంజీవే (Chiranjeevi) తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి నుంచి పోటీ చేయడానికి చిరంజీవిని ఆహ్వనిస్తామని, అక్కడినుంచి పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎపీలో కాంగ్రెస్ (AP Congress) అధికారంలోకి రావడం పక్కా అని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు, లోక్ సభ ఎన్నికల్లో 20 సీట్లు గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ఆయన కాపులకు ఇదే మంచి అవకాశమని అన్నారు.
పూర్తిగా చదవండి..Chinta Mohan : కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి చిరంజీవినే : చింతమోహన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, చిరంజీవినే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి అని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు.
Translate this News: