Chintamaneni : సైకో జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలం : చింతమనేని! శనివారం ఉదయం దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకో జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయిందని ఆరోపించారు. By Bhavana 11 May 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Jagan Sarkar : ఏపీ(AP) లో అన్ని ప్రాంతాల్లో శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం(Election Campaigns) ముగిసింది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ కూటమి(TDP Alliance) అభ్యర్థి చింతమనేని ప్రభాకర్(Chintamaneni Prabhakar) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకో జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయిందని ఆరోపించారు. అన్నింటా ధరలు పెంచేసి ప్రజల వద్ద ముక్కుపిండి వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ దెందులూరు నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి కొంచెం కూడా జరగలేదని అన్నారు.నియోజకవర్గంలో ప్రజలందరికీ మాటిస్తున్నా.. ఎమ్మెల్యే కాగానే నియోజకవర్గంలో ప్రతీ సమస్యను పరిష్కరిస్తామని వివరించారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కూటమి రావల్సిందేనని తెలిపారు.ఇన్నాళ్లూ దోచుకుంది చాలక ఇప్పుడు మళ్లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చారని మండిపడ్డారు.మళ్ళీ వైసీపీ వస్తే మీ ఆస్తులు అన్నీ లాక్కుని మీకు ఒక్క జిరాక్స్ ఇస్తారని... కూటమి ప్రభుత్వం రాగానే ముందు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని తెలిపారు. Also read: కోళ్లు పెంచే రైతులకు శుభవార్త చెప్పిన పురంధేశ్వరి! #politics #tdp #chinthamaneni #denduluru #ycp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి