చోరీల్లో సెంచరీ దాటేసిన మహానుభావుడు.. ఎంత దోచేశాడో తెలుసా?

35 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్న గంజదొంగ శేఖర్‌ ను పెరంబూర్‌ పోలీసులు పట్టుకున్నారు. అతనిపై ఇప్పటికే 100కు పైగా కేసులున్నట్లు తెలిపారు. తాళాలు వేసిన ఇళ్లను పగలు గుర్తించి రాత్రి చోరీకి పాల్పడుతుంటాడని, ఇందుకు సహకరించిన వారిని కూడా జైలుకు పంపించినట్లు వెల్లడించారు.

New Update
చోరీల్లో సెంచరీ దాటేసిన మహానుభావుడు.. ఎంత దోచేశాడో తెలుసా?

తాళాలు వేసిన ఇళ్లను దోచుకోవడమే కులవృత్తిగా మార్చుకున్నాడో ఓ గజదొంగ. ఒకటికాదు రెండు కాదు దాదాపు 35 ఏళ్లుగా ఇదే పనిచేస్తూ సుమారు 100కు పైగా చోరీలకు పాల్పడ్డాడు. అయితే ఇదంతా తాను ఒక్కడే కాకుండా సపోర్ట్ టీమ్ కూడా పెట్టుకున్నాడు. కాగా చెన్నైలోని పెరంబూర్‌ ప్రాంతానికి చెందిన ఆ మహానుభావునితోపాటు అతడికి సహకరించిన వారిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పెరంబూర్‌ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మైలాడుదురై జిల్లా అక్కూరు సిరుపులినాయనార్‌ వీధిలో ఉంటున్న శంకర్‌ ఇంట్లో ఏడు రోజుల క్రితం ప్రవేశించిన ఆగంతకుడు 44 సవర్ల నగలు దోచుకెళ్లాడు. నిందితులు చోరీ సమయంలో ఎత్తుకెళ్లిన సెల్‌ఫోన్‌కు పోలీసులు కాల్‌ చేయగా అది స్విచ్ఛాఫ్‌ చేసి ఉంది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మీనా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఆ సెల్‌ఫోన్‌లో కొత్త సిమ్‌ కార్డ్‌ వేయడాన్ని పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా నాగపట్టినం జిల్లా కొత్వాల్‌చావిడి ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి అక్కడకు చేరుకొని పాత నేరస్తుడు శేఖర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయని తెలిపారు.

Also read :ఆ ప్రముఖ సంస్థ నుంచి ఒకేసారి 120 మంది ఉద్యోగులు ఔట్.. షాకింగ్ కారణం ఇదే!

ఇక శేఖర్‌ 35 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతుండగా అతనిపై నాగపట్టినం, కారైక్కాల్‌, మైలాడుదురై, కడలూరు, తిరువారూరు, తంజావూరు సహా పలు జిల్లాల్లో 100కు పైగా చోరీ కేసులున్నట్లు విచారణలో తెలిందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసుల్లో అరెస్ట్‌ కావడం, బెయిలుతో బయటకు వచ్చి మళ్లీ చోరీలకు పాల్పడుతుంటాడని, పగటి పూట పలు ప్రాంతాల్లో సంచరించి తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి వేళల్లో చోరీకి పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. శేఖర్‌ సమాచారంతో అతనికి సహకరించిన రామనాథపురంకు చెందిన పాండ్యన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇద్దర్నీ కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించినట్లు తెలిపారు. వీటితోపాటు ఇంకెన్ని చోట్ల దొంగతానాలు చేశారనే విషయంపై నిందుతుల నుంచి పూర్త సమాచారం రాబడుతామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది.

Advertisment
తాజా కథనాలు