పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. పుంగనూరు ఘటనపై విచారణ జరించాలని ఆయన డిమాండ్ చేశారు. పుంగనూరు ఘటనకు పోలీసులే కారణమని విమర్శించారు. నేను పుంగనూరు రోడ్లపై తిరగకూడదా.? అని ప్రశ్నించారు. పుంగనూరు మళ్లీ వస్తా.. గర్జిస్తానని చంద్రబాబు హెచ్చరించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా పుంగనూరులో వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనిని అదుపు చేయడానికి పోలీసులు బాష్పవాయవు ప్రయోగించారు. దీంతో పుంగనూరులో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పుంగనూరుకు టీడీపీ శ్రేణులు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.
పూర్తిగా చదవండి..ఖబడ్దార్ పెద్దిరెడ్డి.. మళ్లీ పుంగనూరు వస్తా.. చంద్రబాబు సవాల్
పుంగనూరు ఒక్కసారిగా రణరంగంగా మారింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. వైసీపీ నేతల దాడిలో పలువురు టీడీపీ నేతలు, పోలీస్ అధికారులు గాయపడ్డారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాంతియుతంగా ఉన్న పుంగనూరును చంద్రబాబు హింసాకాండగా మార్చారన్నారు.
Translate this News: