CBN : ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు !

అమరావతి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ క్రమంలో తన పర్యటన సందర్భంగా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటన సందర్భంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపొద్దని బుధవారం నాడే చంద్రబాబు స్పష్టం చేశారు.

New Update
CM Chandrababu: గుడ్ న్యూస్ చెప్పనున్న చంద్రబాబు సర్కార్

Delhi : అమరావతి (Amaravati) నుంచి టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఢిల్లీకి పయనమయ్యారు. ఈ క్రమంలో తన పర్యటన సందర్భంగా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటన సందర్భంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపొద్దని బుధవారం నాడే చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాలను గుంటూరు, విజయవాడ పోలీసు ఉన్నతాధికారులకు ఆయన భద్రతా సిబ్బంది వివరించారు. గురువారం చంద్రబాబు ఢిల్లీ బయలు దేరే ముందు చుట్టు పక్కల ట్రాఫిక్‌ను పోలీసులు (Traffic Police) మళ్లీ ఆపారు. పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజా సేవకులుగా పోలీసులు మారాలంటూ చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం ఎంపీలు ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి ఎంపీలతో కలిసి చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా తెలుగుదేశం ఎంపీలకి ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.

Also read: ప్యాసింజర్‌ రైల్లో అగ్ని ప్రమాదం… కాలిపోయిన బోగీలు!

Advertisment
తాజా కథనాలు