Chandrababu : ఏపీ రాజధాని (AP Capital) పై టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) సంచలన ప్రకటన చేశారు. ఏపీకి రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, ప్రత్యేక సిటీగా తయారు చేస్తామని అన్నారు. అలాగే కర్నూలు ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజావేదికలా కూల్చివేతలు ఉండవని అన్నారు. 3 రాజధానుల్లా రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలు ఉండవని పేర్కొన్నారు. విశాఖలో సునామీలా మెజార్టీలు వచ్చాయని అన్నారు. నువ్వు రావొద్దని జగన్కు విశాఖ ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. రాయలసీమలోనూ ఊహించని మెజార్టీలు ఇచ్చారని తెలిపారు. జగన్పై రాయలసీమ (Rayalaseema) తిరుగుబాటు చేసిందని వ్యాఖ్యానించారు. సీఎంగా ఉన్నా మామూలు మనిషిగానే వస్తా అని అన్నారు. పరదాలు కట్టం, చెట్లు కొట్టేయం అని జగన్ కు కౌంటర్ ఇచ్చారు. స్టేట్ ఫస్ట్ అనే నినాదంలో ముందుకెళ్తాం అని అన్నారు.
పూర్తిగా చదవండి..BIG BREAKING : ఏపీ రాజధానిపై చంద్రబాబు సంచలన ప్రకటన
ఏపీ రాజధానిపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఏపీకి రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అలాగే కర్నూల్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
Translate this News: