EC Serves Notice to KCR: ఎన్నికల ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఏ మాత్రం తేడాలొచ్చినా వెంటనే చర్యలు తీసుకుంటోంది. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) కు కేంద్ర ఎన్నికల సంఘం అడ్వయిజరీ లేఖ రాసింది. ఆ లేఖను నిన్న రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపుతూ కేసీఆర్ కు అందజేయాలని చెప్పింది. ఒక సీఎంగా ఉండి, ఎన్నికల ప్రచారంలో కూడా స్టార్ క్యాంపెయినర్ గా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కేంద్రం ఎన్నికల సంఘం కేసీఆర్ కు సూచించింది. ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగాలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని తెలిపింది.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023: తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం అడ్వయిజరీ లేఖ రాసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండడంతో పాటూ స్టార్ క్యాంపెయినర్ గా ఉంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పింది. వీటిని తీవ్రంగా పరిగణిస్తాం అని సీఈసీ తెలిపింది.
Translate this News: