CBSE : నకిలీ స్కూళ్లే టార్గెట్.. 27 పాఠశాలలపై సీబీఎస్‌ఈ ఆకస్మిక తనిఖీలు

సీబీఎస్‌ఈ పలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. నకీలీ స్కూళ్లను నివారించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీతో పాటు రాజస్థాన్‌లో మొత్తం 27 పాఠశాలల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది.

New Update
CBSE : నకిలీ స్కూళ్లే టార్గెట్.. 27 పాఠశాలలపై సీబీఎస్‌ఈ ఆకస్మిక తనిఖీలు

CBSE Conducts Surprise Inspections : సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) బోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. నకీలీ స్కూళ్లను (Dummy Schools) నివారించడమే లక్ష్యంగా సీబీఎస్‌ఈ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఢిల్లీ (Delhi) తో పాటు రాజస్థాన్‌ (Rajasthan) లో మొత్తం 27 పాఠశాలల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు బోర్డు కార్యదర్శి హిమాన్షు గుప్తా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితమే డమ్మీ స్కూళ్లు, అర్హత లేని అభ్యర్థులతో నడుపుతున్న 20 పాఠశాలల గుర్తింపును సీబీఎస్‌ఈ రద్దు చేసింది.

Also Read: తెలంగాణలో వరద నష్టం రూ.5,438 కోట్లు.. శాఖల వారీగా లెక్కలివే!

ఈ నేపథ్యంలోనే మరోసారి సీబీఎస్‌ఈ తనిఖీల నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అనుబంధ పాఠశాలలన్నీ తమ రూల్స్‌కు కట్టుబడి ఉన్నాయా ? లేదా ? అనేది పరిశీలించేందుకు బోర్టు ఈ తనిఖీలు చేపట్టింది. అయితే ఈ తనిఖీల్లో 27 టీమ్స్ పాల్గొన్నాయి. ఒక్కో టీమ్‌లో సీబీఎస్‌ఈ అధికారితో పాటు సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ ఉన్నారు. ఈ బృందాలు ఏకకాలంలో 27 స్కూళ్లపై తనిఖీలు చేపట్టాయి.

తాము ఎంపిక చేసిన ఈ పాఠశాలల్లో కచ్చితమైన ప్రణాళికతో ఈ తనిఖీలు చేపట్టామని సీబీఎస్‌ఈ కార్యదర్శి హిమాన్షు గుప్తా వెల్లడించారు. అలాగే ఈ తనిఖీల్లో గుర్తించిన అంశాలపై సమీక్ష చేస్తామని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తమ అనుబంధ పాఠశాలలన్నీ కూడా బోర్టు సూచించిన ప్రమాణాలు పాటించేలా చూసేందుకే ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Also Read: దీదీ సంచలన నిర్ణయం.. అసెంబ్లీలో అత్యాచార వ్యతిరేక బిల్లు ఆమోదం..

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Religious conversion: భద్రాచలంలో అన్యమత ప్రచారం.. దేశవ్యాప్తంగా హిందువుల ఆందోళనకు కారణం ఇదేనా?

భద్రాచలంలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాల ప్యాకేజ్‌పై ఇతర మత ప్రచార నినాదాలు ఉన్నాయి. బలవంతపు మతమార్పిడితో హిందూ జనాభా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. 1950 నుంచి 2015 వరకూ హిందూ జనాభా వాటా 7.82% తగ్గింది.

New Update
Religious conversion in India

భద్రాచలం రాములోరి సన్నిధిలో ఇటీవల అన్యమత ప్రచారం కలకలం రేపింది. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలంలో సాక్ష్యాత్తు ఆలయ ప్రాగణంలోనే అన్యమత ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. భక్తులు దైవ దర్శనానికి వచ్చినప్పుడు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా సీతారాముల వారికి వస్త్రాలను సమర్పిస్తుంటారు. దుకాణ దారులు పట్టు వస్త్రాలను అన్యమత ప్రచార స్లోగన్ ముద్రించి ఉన్న కవర్లలో పెట్టి ఇవ్వడం కలకలం రేపుతోంది. మే 31న భక్తుడి ఫిర్యాదుతో అన్యమత ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల తిరుమలలో ఓ వ్యక్తి నమాజ్ చేయడం సంచలనంగా మారింది. ఏడు కొండలపై ఏసు పాటలతో  రీల్స్ చేశారని వార్తలు వచ్చాయి. అంతేకాదు కుంభమేళాలో కూడా ఇతర మత ప్రచారాలు చేశారు. నెల రోజు క్రితం శ్రీకాకుళంలోని దేవాలయాలపై ఏసుక్రీస్తు గుర్తులకు గీశారు. ఇవి చెప్పుకోడానికి చిన్న విషయాలైన భయంకరమై మతఘర్షణకు దారి తీసే అవకాశం ఉంది.

1947కి ముందు మత మార్పిడి

ఇలాంటి అన్య మత ప్రచార వివాదాలు దేశంలో కొత్తేమీ కాదు. బ్రిటిష్ ఇండియా రోజుల నుంచే ఇదొక పెద్ద వివాదంగా ఉంటూ వస్తోంది. హిందువులను పెద్ద ఎత్తున క్రైస్తవులుగా మార్చడానికి క్రైస్తవ మిషనరీలకు బ్రిటిష్ ప్రభుత్వం సహకరించాయనేది ఇప్పటికీ వినిపించే ప్రధాన ఆరోపణ. ఇక స్వాతంత్ర్యం వచ్చాక రాజ్యాంగ రచన కోసం ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ కూడా దీనిపై చర్చింది. బలవంతపు మత మార్పిళ్లను చట్టపరంగా గుర్తించకూడదంటూ 1947 మే 1న తీర్మానం ప్రవేశపెట్టారు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్. టీటీ కృష్ణమాచారి వంటి వాళ్లు మత మార్పిళ్లకు మూలాలేంటో చూడాలని నాడు వాదించారు. అంటరానితనం వంటి సామాజిక దురాచారాల వల్ల హిందువులు క్రైస్తవమతంలోకి మారుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మత మార్పిళ్ల నియంత్రణ కోసం పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెడుతూ వచ్చారు. 1954లో ఇండియన్ కన్వర్షన్ రెగ్యులేషన్ అండ్ రిజిష్ట్రేన్ బిల్లును, 1960లో బ్యాక్ వార్డ్ కమ్యూనిటీస్ రిలీజియస్ ప్రొటెక్షన్ బిల్లును, 1979లో ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్‌ను తీసుకొచ్చారు. కానీ వీటిలో ఏ బిల్లు కూడా చట్ట రూపం దాల్చలేదు. 

తగ్గుతున్న హిందూ జనాభా

2011 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో 79 శాతం హిందులు ఉన్నారు. ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి 2024లో సమర్పించిన వర్కింగ్ పేపర్ ప్రకారం..1950 నుంచి 2015 మధ్య భారతదేశంలో హిందూ జనాభా వాటా 7.82% తగ్గింది. ఇతర మతస్తుల జనాభా 43.15% పెరిగింది. 1950-2015 మధ్య క్రిస్టియన్లు 2.24 నుంచి 2.36 శాతం, సిక్కుల వాటా 1.24 శాతం నుంచి 1.84 శాతానికి పెరిగింది. జైనులు, పార్శీల శాతం తగ్గిందని చెప్పింది. పార్మీలు ఏకంగా 85 శాతం మేర తగ్గిపోయినట్టు తెలిపింది. 1950లో 0.03 శాతంగా ఉన్న వీళ్లు.. 2015 నాటికి 0.004 శాతానికి పడిపోయారు. ఇండియాలో రానురాను హిందూ జనాభా తగ్గుతుందని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రైస్తవ మిషనరీలు భారీగా బలవంత మతమార్పిడిలు చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ముస్లిం మతంలోకి కూడా వలసలు జరుగుతున్నాయి. 

మత మార్పిడిపై చట్టాలు

అన్నీ రకాల బలవంతపు మత మార్పిడిలను అడ్డుకోవాలని పలు రాష్ట్రాలు చట్టాలు చేశాయి. మతమార్పిళ్లను నియంత్రిస్తూ చట్టం తీసుకొచ్చిన తొలి రాష్ట్రం ఒడిశా. 1967లో ఒడిశా ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ యాక్ట్‌ను పాస్ చేశారు. 2020లో లవ్ జిహాద్ పేరుతో ఉత్తర్‌ప్రదేశ్ ఓ చట్టం చేసింది. హిందూ అమ్మాయిలను ముస్లిం అబ్బాయిలు పెళ్లి చేసుకొని ఇస్లాంలోకి మారుస్తున్నారనేది హిందుత్వవాదుల ఆరోపణ ఉంది. మత మార్పిళ్ల నియంత్రణకే కర్ణాటక అసెంబ్లీ ఆమోదించిన రైట్ టు ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ యాక్ట్-2021 ఏర్పాటు చేసింది. ఇక ఇటీవల మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాలనే తీసుకొచ్చాయ్. మరికొన్ని రాష్ట్రాలు కూడా తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

మతమార్పిడికి కారణాలివే..

ఏదో ఒకటి ఆశ చూపి బతిమిలాడో బెదిరించో బలవంతంగా మతం మారుస్తున్నారనే ఆరోపణలు ఎన్నైనా ఉండొచ్చు... కానీ మత మార్పిళ్ల వెనుక బలమైన సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నాయనేది వాస్తవం. హిందూమతంలో అంటరానితనానికి, వెలివేతకు గురైన కులాలు దాన్ని భరించలేక మతం మారుతూ వస్తున్నారు. పేదరికం కూడా దీనికి మరొక కారణం. కొన్ని చోట్ల అగ్రవర్ణాలుగా చెప్పుకునే కులాల్లోని పేదలు కూడా మతం మారారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో గతంలో క్రైస్తవంలో చేరిన ఆదివాసులను హిందూత్వ సంస్థలు ఘర్ వాపసీ పేరుతో హిందూమతంలోకి చేర్పించాయి. ఇవి చాలా సార్లు ఘర్షణలకు, కొన్ని సార్లు మతకల్లోలాలకు కూడా దారితీశాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కావొస్తున్నా.. మతం అనే అంశమే రాజకీయ అజెండాలో అన్నింటికన్నా ముందుగా ఉంటుంది. కొన్ని పార్టీలు దాన్ని వాడుకొని రాజకీయంగా ఎదగాలని చూస్తున్నాయి.

hindu-population-down | EAC report | Anti-Conversion Act | Anti conversion bill | Religious Conversion | anti-conversion bill rajasthan

Advertisment
Advertisment