Case On Tamil Nadu BJP State Chief Annamalai: తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు షాక్ ఇచ్చారు పోలీసులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆయనపై FIR నమోదు చేశారు. లోక్ సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా గురువారం అవరంపాళయం ప్రాంతంలో అనుమతించబడిన ప్రచార సమయాలను మించి ప్రచారం చేశారనే ఆరోపణలపై కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి కె అన్నామలై, కోయంబత్తూరు జిల్లా బీజేపీ కార్యదర్శి రమేష్లపై కేసు నమోదు చేశారు. అయితే.. పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారాన్ని రాత్రి 10 గంటలలోపు ముగించాలని ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేర్కొంది. రాత్రి సమయం 10 దాటినా అన్నామలై ప్రచారం చేయడంపై పోలీసులకు ఫిర్యాదు రాగ కేసు నమోదు చేశారు.
పూర్తిగా చదవండి..Annamalai: తమినాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై కేసు నమోదు
ఎన్నికల కోడ్ ఉల్లఘించిన నేపథ్యంలో తమినాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై కేసు నమోదు అయింది. పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారాన్ని రాత్రి 10 గంటలలోపు ముగించాలని ఈసీ నిబంధన పెట్టింది. కాగా, రాత్రి సమయం 10 దాటినా అన్నామలై ప్రచారం చేశారు.
Translate this News: