Virat Kohli Pub: విరాట్‌ కోహ్లికి షాక్.. వన్‌8 పబ్‌పై కేసు నమోదు

స్టార్‌బ్యాట్స్‌మెన్ విరాట్‌ కోహ్లికి చెందిన వన్‌8 కమ్యూన్‌ పబ్‌పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పబ్‌తో పాటు మరికొన్ని పబ్‌లు నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో వాటిపై కేసు నమోదైంది.

New Update
Virat Kohli Pub: విరాట్‌ కోహ్లికి షాక్.. వన్‌8 పబ్‌పై కేసు నమోదు

One8 Commune Pub: స్టార్‌ బ్యాట్స్‌మెన్ విరాట్‌ కోహ్లికి బిగ్ షాక్ తగిలింది. బెంగళురులో అతనికి చెందిన పబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్ణీత సమయం దాటాకా కూడా పబ్‌ను నిర్వహిస్తుండటంతో పోలీసులు ఈ చర్యలకు పాల్పడ్డారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటలోని చిన్నస్వామి స్టేడియంకు దగ్గర్లోనే కొహ్లికి చెందిన వన్‌8 కమ్యూన్ అనే పబ్‌ ఉంది. ఈ పబ్‌తో పాటు మరికొన్ని పబ్‌లు కూడా నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా రూల్స్ పాటించకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని పోలీసుల దృష్టికి వెళ్లింది.

Also Read: తమిళనాడులో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పబ్‌లలో నుంచి పెద్ద శబ్దంతో మ్యూజిక్ వినిపిస్తోంది కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి అక్కడ అర్ధరాత్రి ఒంటిగంట వరకే పబ్‌ను నిర్వహించుకునే నిబంధన ఉంది. దీంతో విరాట్‌ కోహ్లి పబ్‌తో పాటు మరికొన్ని పబ్‌లు ఒంటిగంట దాటాక కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఫిర్యాదుల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఒంటిగంట దాటిన తర్వాత నడుస్తున్న వన్‌8 కమ్యూన్‌ పబ్‌తో పాటు మరికొన్ని పబ్‌లపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నారు. ఇదిలాఉండగా వన్‌8 కమ్యూన్కు ఢిల్లీ, ముంబయి, పూణె, కోల్‌కతా లాంటి నగరాల్లో కూడా బ్రాంచ్‌లు ఉన్నాయి. బెంగళూరులో ఉన్న ఈ పబ్‌ను గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించారు.

Also Read: రాయ్‌గఢ్‌ ఫోర్ట్‌ను ముంచెత్తిన వరద.. చిక్కుకున్న పర్యాటకులు

Advertisment
తాజా కథనాలు