BIG BREAKING : హుస్నాబాద్ లో ఘోర ప్రమాదం.. నడి రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. హుస్నాబాద్-కరీంనగర్ ప్రధాన రహదారిపై అదుపు తప్పి కారు పల్టీలు కొట్టింది. యశ్వంత్ అనే యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలవగా హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు.

New Update
BIG BREAKING : హుస్నాబాద్ లో ఘోర ప్రమాదం.. నడి రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు

SIDDIPET : సంక్రాంతి పండుగపూట సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వేగంగా వెళ్తున్న కారు.. ఆర్టీసీ బస్సును ఓవర్ టెక్ చేసేందుకు ట్రే చేయగా అదుపు తప్పింది. దీంతో ఆ కారు నాలుగైదు పల్టీలు కొట్టిగా.. అందులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు ఆ వేగానికి ఎగిరి బయటపడ్డారు. ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు తీవ్ర గాయలతో బయటపడగా..  యశ్వంత్ అనే యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. ఇక ఈ కారు బోల్తా పడినప్పుడు ముందుగా దంపతులు వెళ్తున్న బైక్ కు తృటిలో ప్రమాదం తప్పింది. కాస్త బైక్ వేగం తగ్గిన వారిద్దిరూ దాదాపుగా చనిపోయే ప్రమాదంగానే వీడియో చూస్తే అర్థమవుతుంది.

ఇది కూడా చదవండి : Telangana: ప్రైవేటు బస్సులో భారీ చోరీ.. రూ.12.80 లక్షలు కొట్టేసిన దుండగులు..

వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సకోసం తరలించారు. అయితే వీరందరూ హుస్నాబాద్ కు చెందిన మైనర్ యువకులు కావడం గమనార్హం. కాగా ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక విషయం తెలుసుకున్న యువకులు బంధువులు, కుటుంబ సభ్యులు హుస్నాబాద్ ఆస్పత్రికి చేరుకుని గుండులవిసేలా రోధించారు.

Advertisment
తాజా కథనాలు