Breaking:విజయవాడ బస్టాండ్‌ లో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురి మృతి

విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్లాల్సిన లగ్జరీ బస్సు నెహ్రు బస్టాండ్‌ లో బీభత్సం సృష్టించింది.ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్‌ తో పాటు మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.

జమ్మలమడుగులో హైటెన్షన్‌.. నేతలకు భారీగా భద్రత పెంపు!
New Update

ఏపీ లోని విజయవాడలో సోమవారం ఉదయం అనుకొని సంఘటన జరిగింది. విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్లాల్సిన లగ్జరీ బస్సు నెహ్రు బస్టాండ్‌ లో బీభత్సం సృష్టించింది.ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్‌ తో పాటు మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం ప్లాట్‌ ఫాం నంబర్‌ 12 వద్ద జరిగింది.

ఏపీ సర్వీసు మెట్రో లగ్జరీ బస్సు విజయ వాడ నుంచి గుంటూరు వెళ్లాల్సి ఉంది. ఇంతలో ఈ ఘోరం చోటు చేసుకుంది. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ప్లాట్‌ ఫాం పైకి దూసుకెళ్లింది. డ్రైవర్‌ రివర్స్‌ గేర్‌ బదులు ఫస్ట్‌ గేర్‌ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు డిపో రిజనల్‌ మేనేజర్‌ చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో కండక్టర్, మహిళా ప్రయాణికురాలు, రెండున్నరేళ్ల బాబు.. ముగ్గురు మృతి చెందారు. బస్సు ప్రయాణికుల మీదికి దూసుకువచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Updated soon...

#bus-stop #bus-accident #vijayawada #ap
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe