BJP Spokesperson Rachana Reddy : కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచన రెడ్డి(Rachana Reddy). కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఆ పార్టీ అసలైన రంగు బయట పడిందని అన్నారు. ఎన్నికల ముందు ఎలాంటి వాగ్దానాలు చేశారో.. మనం చూశామని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ఓట్లు దండుకున్నారని విమర్శించారు. మైనారిటీ వెల్ఫైర్ ద్వారా తబ్లీగి జమాత్ కు నిధులు వెళ్లాయని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఉన్న తబ్లీగి జమాత్ కు 3 కోట్లు నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..TS BJP : రైతు భరోసాకు నిధులు ఎందుకు ఇవ్వలేదు.. రచన రెడ్డి ఫైర్!
కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచన రెడ్డి. తబ్లీగి జమాత్ ను ప్రోత్సహిస్తున్నారంటే ఉగ్రవాదానికి గేట్లు తెరిచినట్లే అని అన్నారు. ఈ సంస్థకు నిధులు ఎలా ఇచ్చారని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Translate this News: