Bandi Sanjay Serious Warning to BRS: కుత్బుల్లాపూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్(Kuna Srisailam Goud)పై బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే వివేకానంద దాడి చేయడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay Kumar) తీవ్రంగా స్పందించారు. బీజేపీ కార్యకర్తలు భయపడరని, సంస్కారం పక్కన పెడితే ఉరికించి కొడతామంటూ బీఆర్ఎస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం నాడు ఓ ఛానెఎల్ ఇంటర్వ్యూలో చర్చ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్పై అధికార పార్టీ ఎమ్మెల్యే వివేకానంద దాడికి పాల్పడ్డారు. దాంతో ఇవాళ శ్రీశైలం గౌడ్ను పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు బండి సంజయ్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
పూర్తిగా చదవండి..Telangana Politics: ఉరికించి కొడతాం.. బీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ సీరియస్ వార్నింగ్..!
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి ఉగ్రరూపం దాల్చారు. ఉరికించి కొడతామంటూ తనదైన శైలిలో బీఆర్ఎస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పై ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాడి చేయడంపై సీరియస్ గా రియాక్ట్ అయిన ఆయన.. బీఆర్ఎస్ నేతలకు ఈ విధంగా వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ నేతలకు సంస్కారం ఉందని, అది పక్కన పెడితే బీఆర్ఎస్ నేతలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్.
Translate this News: