Bharat Rice: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మోడీ సర్కార్ (Modi Govt) సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు కాస్త ఊరట లభించనుంది. రేపటి నుంచి మార్కెట్లోకి భారత్ రైస్ (Bharat Rice) రానుంది. కిలో రూ.29కే అమ్మాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మార్కెట్ లో 25 కిలోల బియ్యం బస్తా రూ.1600 నుంచి రూ. 1800 వరకు ఉంది. బియ్యం యొక్క క్వాలిటీని భట్టి అమ్మే ధర ఉంటుంది. ప్రస్తుతం దేశ మార్కెట్ లో కిలో బియ్యం ధర రూ. 60 నుంచి రూ.120 మధ్య ఉంది. తాజాగా కేంద్రం తేనున్న భారత్ రైస్ పథకం ద్వారా రూ.29లకే కిలో బియ్యం అనేది సామాన్యుడికి భారీ ఊరట ఇవ్వనుంది.
పూర్తిగా చదవండి..Bharat Rice: గుడ్ న్యూస్.. రూ.29లకే కిలో బియ్యం.. కేంద్రం కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ రైస్ ద్వారా కిలో బియ్యం రూ.29లకే అందించనుంది. వచ్చే వారం నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం దేశ మార్కెట్లో కిలో బియ్యం ధర రూ. 60 నుంచి రూ.120 మధ్య ఉంది.
Translate this News: