/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/kcr-jpg.webp)
KCR : మాజీ సీఎం కేసీఆర్ కు ఎన్నికల సంఘం(Election Commission) బిగ్ షాక్ ఇచ్చింది. సిరిసిల్ల(Sircilla) లో కాంగ్రెస్(Congress) కు వ్యతిరేకంగా "అవమానకరమైన, అభ్యంతరకరమైన ప్రకటనలు" చేసినందుకు తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు రాత్రి 8 గంటల నుండి 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. కాగా మాజీ సీఎం కేసీఆర్ పై ఇటీవల కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వగా.. ఆయన స్పందించక పోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
#LokSabhaElections2024 | Election Commission of India bans former Telangana CM and BRS chief K Chandrashekar Rao from campaigning for 48 hours, starting 8 pm today, 1st May for making "derogatory and objectionable statements" against Congress in Sircilla. pic.twitter.com/lPPN75rhHT
— ANI (@ANI) May 1, 2024
Also Read : కాంగ్రెస్ నేతలకు హైదరాబాద్ పోలీసుల షాక్.. అమిత్ షా ఫేక్ వీడియోల కేసులో ముగ్గురి అరెస్ట్!