BIG BREAKING : మాజీ సీఎం కేసీఆర్‌కు ఈసీ బిగ్ షాక్.. ప్రచారం బ్యాన్

TG: మాజీ సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. రెండు రోజుల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విదించింది. కాగా ఇటీవల సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈసీ కేసీఆర్‌కు నోటీసులు పంపగా.. ఆయన స్పందించకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
BIG BREAKING : మాజీ సీఎం కేసీఆర్‌కు ఈసీ బిగ్ షాక్.. ప్రచారం బ్యాన్

KCR : మాజీ సీఎం కేసీఆర్ కు ఎన్నికల సంఘం(Election Commission) బిగ్ షాక్ ఇచ్చింది. సిరిసిల్ల(Sircilla) లో కాంగ్రెస్‌(Congress) కు వ్యతిరేకంగా "అవమానకరమైన, అభ్యంతరకరమైన ప్రకటనలు" చేసినందుకు తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు రాత్రి 8 గంటల నుండి 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. కాగా మాజీ సీఎం కేసీఆర్ పై ఇటీవల కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వగా..  ఆయన స్పందించక పోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read : కాంగ్రెస్ నేతలకు హైదరాబాద్ పోలీసుల షాక్.. అమిత్ షా ఫేక్ వీడియోల కేసులో ముగ్గురి అరెస్ట్!

Advertisment
తాజా కథనాలు