/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-15-12.jpg)
BCCI: బోర్డు ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) T20 వరల్డ్ కప్ (T20 World Cup 2024) గెలిచిన టీమ్ ఇండియాకు భారీ ప్రైజ్ మనీ (Prize Money) ప్రకటించింది. మెన్ ఇన్ బ్లూ చారిత్రాత్మక విజయం తర్వాత బీసీసీఐ సెక్రటరీ జే షా (Jay Shah) ఆటగాళ్లు, కోచ్లు, మొత్తం సహాయక సిబ్బందితో సహా రూ. 125 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు తెలిపారు. అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు మొత్తం జట్టును అభినందిస్తూ జే షా నెట్టింట పోస్ట్ పెట్టాడు.
I am pleased to announce prize money of INR 125 Crores for Team India for winning the ICC Men’s T20 World Cup 2024. The team has showcased exceptional talent, determination, and sportsmanship throughout the tournament. Congratulations to all the players, coaches, and support… pic.twitter.com/KINRLSexsD
— Jay Shah (@JayShah) June 30, 2024
'2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ను గెలుచుకున్నందుకు టీమ్ ఇండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. టోర్నమెంట్ అంతటా జట్టు అసాధారణమైన ప్రతిభ, సంకల్పం, క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ అత్యుత్తమ విజయాన్ని సాధించిన ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బందికి అభినందనలు!' అని జే షా తన X ఖాతాలో రాశారు. జూన్ 29, శనివారం కెన్సింగ్టన్ ఓవల్లో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ రెండవ T20 ప్రపంచ కప్ను గెలుచుకుని సంబరాల్లో మునిగితేలింది.