TG Crime: హైదరాబాద్ లో మరో దారుణం.. బార్బర్ గొంతు కోసి..

హైదరాబాద్ శివారులోని నార్సింగ్ లో దారుణం చోటు చేసుకుంది. రాజు అనే బార్బర్‌ను ప్రవీణ్ అనే మరో బార్బర్ గొంతుకోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఇంటిముందు ముగ్గు విషయంలో ఇరు కుటుంబాల మధ్య గత డిసెంబర్ లో వివాదం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

New Update
TG Crime: హైదరాబాద్ లో మరో దారుణం.. బార్బర్ గొంతు కోసి..

Narsing Barber Incident: రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దారుణం చోటుచేసుకుంది. రాజు (50) అనే బార్బర్‌ను మరో బార్బర్ ప్రవీణ్ గొంతుకోసి అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం నిందితుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నార్సింగ్ సీఐ హరికృష్ణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గత డిసెంబర్ లో వారి ఇళ్ల ముందు ముగ్గులు వేసే విషయంలో ఇరువురికి తగాదాలు వచ్చాయని తెలిపారు. ఇంటి ముందు ముగ్గును చెడిపేశాడని రాజుతో  ప్రవీణ్ గొడవ పడ్డాడాడని చెప్పారు. అప్పట్లో రాజు నార్సింగ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారని చెప్పారు. అయితే.. ఆ సమయంలో పెద్దలు సర్ది చెప్పి కేసు వాపసు చేయించారన్నారు. అప్పటి నుంచి వీరిమధ్య చిన్న చిన్న గొడవలు అవుతున్నట్లు తమ విచారణలో తెలిసిందన్నారు. ఈ ఇద్దరు వరుసకు బంధువులు అవుతారని వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు.


Also Read: సుప్రీం కోర్టులో రేవంత్ సర్కార్‌కు బిగ్ రిలీఫ్!

Advertisment
తాజా కథనాలు