Kangana Ranauth: హసీనా భారత్‌లో సేఫ్గా ఉంది...మీరే సురక్షితంగా లేరు: బీజేపీ ఎంపీ కంగనా!

బంగ్లాదేశ్‌ లో జరిగిన తిరుగుబాటు గురించి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ మండిపడ్డారు. బంగ్లా ప్రధాని హసీనా భారత్‌ లో సురక్షితంగా ఉండడం ఎంతో గౌరవప్రదమైన విషయమని ఆమె అన్నారు. ముస్లిం దేశాల్లోనే ఎవరూ సురక్షితంగా లేరని ఈ సందర్భంగా కంగనా పేర్కొంది.

Kangana Ranauth: హసీనా భారత్‌లో సేఫ్గా ఉంది...మీరే సురక్షితంగా లేరు: బీజేపీ ఎంపీ కంగనా!
New Update

kangana Ranauth: బంగ్లాదేశ్‌ లో జరిగిన తిరుగుబాటు గురించి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ మండిపడ్డారు. బంగ్లా ప్రధాని హసీనా భారత్‌ లో సురక్షితంగా ఉండడం ఎంతో గౌరవప్రదమైన విషయమని ఆమె అన్నారు. ముస్లిం దేశాల్లోనే ఎవరూ సురక్షితంగా లేరని ఈ సందర్భంగా కంగనా పేర్కొంది. హింసాత్మక నిరసనల కారణంగా.. షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసిన తర్వాత బంగ్లాదేశ్‌ను విడిచి పెట్టవలసి వచ్చిందని వివరించారు.

అలాగే, హిందూ దేశం ఎద్దేవా చేసేవారిపై ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. భారతదేశంలో నివసించే వారు హిందూ దేశాన్ని కాదు.. రామరాజ్యం కావాలని అడుగుతుంటారని ఆమె అన్నారు. అయితే, ముస్లిం దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల్లోని ముస్లింలే సురక్షితంగా లేరని ఈ సందర్భంగా ఆమె సోషల్‌ మీడియాలో ఎద్దేవా చేశారు. మనం రామరాజ్యంలో జీవించడం మన అదృష్టం అంటూ ఎంపీ కంగనా రనౌత్ పేర్కొన్నారు.

Also read:  బంగ్లాదేశ్ కు రైలు సర్వీసులు రద్దు

#bangladesh #bjp-mp #hasina #kangana-ranuth #prime-minister
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe