Bangladesh Crisis 2024 : బంగ్లాదేశ్ తిరుగుబాటు.. ప్రధాని షేక్ హసీనా భారత్ కే ఎందుకు వచ్చారు?

బంగ్లాదేశ్ లో తిరుగుబాటు తెలిసిందే. దీంతో ప్రధాని షేక్ హసీనా అక్కడ నుంచి భారత్ వచ్చారు. ఆమె భారత్ రావడం వెనుక ప్రభుత్వ సహకారం ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె కనుక అక్కడే ఉంటే ప్రాణాపాయం కలిగి ఉండేది. ఆమె అక్కడి నుంచి వెళ్లిన వెంటనే ప్రజలు ఆమె బంగ్లాలో విధ్వంసం సృష్టించారు. 

New Update
BIG BREAKING: బంగ్లాదేశ్‌ పార్లమెంట్ రద్దు.. కొత్త ప్రధాని ఎవరంటే?

Sheikh Hasina Take Shelter In India : బంగ్లాదేశ్‌ (Bangladesh) లో తిరుగుబాటు జరిగింది. ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) రాజీనామా చేశారు. ఆమె దేశం విడిచి వెళ్లిపోయారు.  ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్ నుంచి హసీనా  విమానంలో భారత్ (India) లోని ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌కు వచ్చేశారు. షేక్ హసీనా భారతదేశం నుండి ఎటువంటి రాజకీయ సహాయం కోరలేదు. అయితే, భారత్  జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌ ఎయిర్‌బేస్‌కు చేరుకుని ఆమెను  కలిశారు. బంగ్లాదేశ్‌లోని పరిస్థితులపై గంటకు పైగా చర్చించారు. జాతీయ మీడియాలో వస్తున్నసమాచారం ప్రకారం, షేక్ హసీనా ఢాకాను విడిచిపెట్టాలనే ప్లాన్ గురించి ఢిల్లీకి అప్పటికే  తెలుసు.  కష్ట సమయాల్లో భారతదేశం మరోసారి షేక్ హసీనా పట్ల స్నేహాన్ని ప్రదర్శించింది.

Bangladesh Crisis 2024:  మీడియా కథనాల ప్రకారం..  బంగ్లాదేశ్‌లో పరిస్థితి క్షీణించిన తరువాత, హసీనా దేశం విడిచిపెట్టడంపై రైసినా కొండపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో షేక్ హసీనా ఢాకా నుంచి హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకోవడంపై చర్చ జరిగింది. దీంతో పాటు బంగ్లాదేశ్ నుంచి హసీనాను సురక్షితంగా ఎలా తరలించాలనే దానిపై కూడా ప్రభుత్వం చర్చించింది.

ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులతో సమావేశం..
మరోవైపు, ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో పాటు ఆర్మీ , ఇంటెలిజెన్స్ సీనియర్ అధికారులతో కూడా సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత బీఎస్ఎఫ్, ఆర్మీ అప్రమత్తమయ్యాయి. హసీనా విమానాన్ని సురక్షితంగా తరలించే బాధ్యతను వైమానిక దళానికి అప్పగించారు. ఢాకాలోని షేక్ హసీనాకు సహాయం అందించాలని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను ప్రభుత్వం కోరింది.

బంగ్లాదేశ్‌ను విడిచి వెళ్లాలని హసీనాకు సూచించారు..
సమావేశం అనంతరం షేక్ హసీనా బృందానికి కూడా భారత్ నిర్ణయం గురించి తెలియజేశారు. ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని షేక్ హసీనాను వెంటనే బంగ్లాదేశ్ వదిలి వెళ్లాలని సూచించారు. హసీనా హడావిడిగా బంగ్లాదేశ్‌ను వదిలి త్రిపురలో విమానం దిగింది. హసీనా విమానం భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే, ఎయిర్ ఫోర్స్ ఆమె భద్రతకు పూర్తి బాధ్యత తీసుకుంది.

హసీనా ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది..
షేక్ హసీనా బంగ్లాదేశ్‌లో ఎక్కువ కాలం ఉండి ఉంటే ఆమె ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని భావిస్తున్నారు. ఆమె బయటకు వచ్చిన వెంటనే ఆందోళనకారులు ప్రధాని నివాసంలోకి కూడా ప్రవేశించారు. ఆమె పడకగదిలో ఉంచిన వస్తువులను కూడా ఆందోళనకారులు దోచుకున్నారు. దీనికి సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ప్రధానికి పరిస్థితిని తెలియచేసిన జైశంకర్..
మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. షేక్ హసీనా భారతదేశానికి చేరుకున్న తర్వాత, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) పార్లమెంట్ హౌస్‌కు చేరుకుని, పరిస్థితిని ప్రధానికి తెలియజేశారు. ఆ తర్వాత లోక్‌సభ మరుసటి రోజుకు వాయిదా పడడంతో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తన సీటు నుంచి లేచి జైశంకర్‌ వద్దకు వెళ్లారు. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరి ఏమిటి వంటి 5-7 ప్రశ్నలను రాహుల్ గాంధీ అడిగారు. దీనికి ఎస్ జైశంకర్ జవాబిస్తూ పరిస్థితిని గమనిస్తున్నామని తెలిపారు. ఏదైనా అప్‌డేట్ వచ్చిన వెంటనే తెలియపరుస్తామని సమాధానమిచ్చారు. 

Also Read : అన్న క్యాంటీన్లపై మంత్రి నారాయణ కీలక భేటీ

Advertisment
తాజా కథనాలు