బంగ్లాదేశ్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఈసారి ఆందోళనకారులు సుప్రీం కోర్టుపై నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే ఇతర న్యాయమూర్తులు కూడా దిగిపోవాలంటూ కోర్టు వద్ద నిరసనలు చేశారు. దీంతో చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ రాజీనామా చేశారు. అయితే ఇటీవల బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్.. ఇతర న్యాయమూర్తులతో కలిసి సమావేశానికి పిలుపునిచ్చారు. తాత్కాలిక ప్రభుత్వానికి అనుమతి లేదని వాళ్లు చెప్పబోతున్నారని.. అలాగే ఆయన దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలు వచ్చాయి. దీంతో విద్యార్థులతో పాటు నిరసనకారులు సుప్రీంకోర్టు వద్దకు చేరి ఆందోళనకు దిగారు. దీంతో న్యాయమూర్తులు సమావేశం ఆగిపోయింది. నిరసనకారులు చీఫ్ జస్టిస్ దిగిపోవాలంటూ డిమాండ్లు చేయడంతో ఆయన అంగీకరించాల్సి వచ్చింది.
పూర్తిగా చదవండి..Bangladesh: బంగ్లాదేశ్లో మళ్లీ నిరసనలు.. చీఫ్ జస్టిస్ రాజీనామా
బంగ్లాదేశ్లో ఆందోళనకారులు సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే ఇతర న్యాయమూర్తులు కూడా దిగిపోవాలంటూ కోర్టు వద్ద నిరసనలు చేశారు. దీంతో చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ రాజీనామా చేశారు.
Translate this News: