ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒకే వేదికపై తెలంగాణ గవర్నర్, సీఎం
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే (Justice CJ Alok Aradhey)ఆదివారం (23-07-2023) రోజున రాజ్భవన్లో ప్రమాణం స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్తో పాటుగా తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. గత కొన్నేళ్ల నుంచి రాజ్భవన్కి వెళ్లని సీఎం కేసీఆర్, జడ్జి ప్రమాణ స్వీకారానికి వెళ్లటం చర్చనీయాంశంగా మారింది.