/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-20-4.jpg)
Manchu Vishnu : బెంగళూర్ రేవ్ పార్టీ (Bangalore Rave Party) లో తెలుగు నటులు శ్రీకాంత్ (Srikanth), హేమలు పాల్గొన్నట్లు ఆరోపణలొస్తున్న విషయం తెలిసిందే. కాగా ముఖ్యంగా హేమ (Hema) కు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ రావడం మరింత దుమారం రేపింది. అయితే ఈ ఇష్యూపై స్పందించిన 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు.. హేమకు మద్ధతుగా నిలిచాడు. ఆమెపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
Regarding the recent drug-related case at a rave party, few media outlets and individuals are making baseless allegations about actress Ms.Hema.
I urge everyone to refrain from jumping to conclusions and spreading unverified information. Ms.Hema deserves to be presumed innocent…
— Vishnu Manchu (@iVishnuManchu) May 25, 2024
ఇది కూడా చదవండి: Hardik-Natasha : విడాకులకు సిద్ధమైన హార్డిక్ పాండ్యా-నటాషా.. ఆ ఫొటోలన్నీ డిలిట్!
'ఇటీవల రేవ్ పార్టీలో జరిగిన డ్రగ్స్ కేసు (Drugs Case) కు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు నటి శ్రీమతి హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. శ్రీమతి హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగా భావించబడాలి. ఆమె కూడా ఒక తల్లి, భార్య కాబట్టి.. పుకార్ల ఆధారంగా ఆమె ఇమేజ్ను డ్యామేజ్ చేయడం అన్యాయం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుంది. శ్రీమతి హేమకు సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యాలను పోలీసులు అందజేస్తే.. 'మా' తగిన చర్యలు తీసుకుంటుంది. అప్పటి వరకు దయచేసి నిరాధారమైన వార్తలను ప్రచారం చేయొద్దు' అని కోరారు.