Karimnagar : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా బీజేపీ(BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) ప్రజాహిత పాద యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన శనివారం కరీంనగర్(Karimnagar) లోని మహాశక్తి ఆలయాన్ని సందర్శించారు. ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాహిత యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నిర్వహిస్తున్న హోమం వద్దకు వెళ్లి కంకణం కట్టుకున్నారు. అలాగే తన నివాసానికి వెళ్లి మాతృమూర్తికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కొండగట్టు అంజన్న సన్నిధిలో అర్చనలు పూర్తయిన తర్వాత మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్రను ప్రారంభించారు. ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని ప్రజలకు వివరిస్తూ యాత్రకు వెళ్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ప్రజాహిత యాత్ర’ పేరుతో మొత్తం 119 కి.మీల మేర బండి సంజయ్ కుమార్ పాదయాత్ర చేపట్టనున్నారు. ఆయన పాదయాత్ర మొదటి దశ ఫిబ్రవరి 15న ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
పూర్తిగా చదవండి..Bandi Sanjay : నేనేం చేస్తానో చూపిస్తా.. ప్రజాహిత పాదయాత్ర షురూ
బీజేపీ ఎంపీ బండి సంజయ్ 'ప్రజాహిత పాద యాత్ర చేపట్టారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ యాత్ర సాగనుండగా శనివారం కరీంనగర్లోని మహాశక్తి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజాలు చేశారు. మొత్తం 119 కి.మీల మేర మొదటి దశ ఫిబ్రవరి 15న ముగుస్తుంది.
Translate this News: