Ayodhya Ram Mandir : జనవరి 22న అయోధ్యలో జరగనున్న శ్రీరామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంరంగవైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఏర్పట్లన్నీ పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ (pm modi)తోపాటు దాదాపు 4వేలకుపైగా వీఐపీలు, లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయోధ్య(ayodhya) రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై దేశంలోనే కాదు దేశవిదేశాల్లోని హిందూవులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మారిషస్ ప్రభుత్వం(Government of Mauritius) కీలక నిర్ణయం తీసుకుంది. దీని గురించి తెలిస్తే మీరు కూడా గర్వపడతారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కోసం సన్నాహాలు చివరి దశలో ఉన్నాయి. దేశ, ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారతదేశం నుండి అమెరికా (america), బ్రిటన్ (britan), ఇండోనేషియా, ఆస్ట్రేలియా మొదలైన అనేక దేశాలలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం చూడాలని ఎన్నారైలలో ఎంతో ఉత్సాహం ఉంది.ఇందులో భాగంగా మారిషస్ ప్రభుత్వం జనవరి 22 న అయోధ్యలో రామ మందిరం చారిత్రక” ప్రాణ ప్రతిష్ఠాపన వేడుకలో పూజకు హాజరు కావడానికి హిందూ పౌర సేవకులకు రెండు గంటల ప్రత్యేక సెలవును మంజూరు చేయాలని నిర్ణయించింది.
పూర్తిగా చదవండి..Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం…జనవరి 22న పబ్లిక్ హాలిడే ప్రకటించిన ఆ దేశం..!!
అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మారిషస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 22న హిందువులకు సెలవు ఇవ్వాలని మారిషస్ ప్రభుత్వం నిర్ణయించింది.
Translate this News: