IND vs SA : సౌతాఫ్రికాపై ఇవాళ జరగనన్న టీ20 ఫైనల్ సమరానికి యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ను ఆడించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఓపెనర్గా అట్టర్ఫ్లాప్ అవుతున్న కోహ్లీని వన్-డౌన్లో ఆడించి.. దూబేని పక్కన పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే రోహిత్ మాత్రం మార్పులకు ఇష్టంపడడంలేదట.

Trinath
మద్యపానం, ధూమపానం జ్ఞాపకశక్తికి బద్ద శత్రువులు అని చెబుతున్నారు డాక్డర్లు. మితిమీరిన మద్యపానం, ధూమపానం మెదడు కణాలను దెబ్బతీస్తుంది. అటు తగినంత నిద్ర లేకపోవడం, మంచి ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
T20 World Cup 2024 : ఇంగ్లండ్పై జరిగిన సెమీస్ ఫైట్లోనూ కోహ్లీ అట్టర్ఫ్లాప్ అయ్యాడు. 9 బంతుల్లో 9 పరుగులే చేశాడు. ఈ టీ20 WCలో కోహ్లీ 10.71 సగటుతో 100 స్టైక్రేట్తో బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా నిరాశపరిచాడు. సెమీస్ వరకు ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్లలో కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు కోహ్లీ.
ఢిల్లీ ఎయిర్పోర్టు టెర్మినల్-1 పైకప్పు కూలడం, ఒక వ్యక్తి మరణించడంతో బీజేపీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు అయెధ్య రామమందిరం గర్భగుడిలో వాటర్ లీకేజీ, జవాన్ల శిబిరాల్లో వరద నీరు, ముంబై అటల్ సేతుపై పగుళ్లను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై దుండగులు మరోసారి దాడి చేశారు. పార్లమెంట్లో ప్రమాణస్వీకారం తర్వాత ఒవైసీ జై పాలస్తీనా నినాదాలు చేసినందుకు వ్యతిరేకంగా కొందరు ఈ అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. భారత్ మాతాకీ జై, ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అంటూ ఒవైసీ ఇంటిపై పోస్టర్లు అంటించారు.
ఇటివలే పీఎం కిసాన్ 17వ విడత నిధులు విడుదలయ్యాయి. అయితే కొంతమందికి అర్హత ఉన్నా తమకు మనీ ట్రాన్స్ఫర్ అవ్వలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకవేళ మీ ఇన్స్టాల్మెంట్ నిలిచిపోయి ఉంటే 1800115526 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చు.
IGNOU Admissions : ఇగ్నోలో ఆన్లైన్ లేదా డిస్టెన్స్ ఎడ్యూకేషన్లో చదవాలనుకునే అభ్యర్థులకు ఇదే లాస్ట్ ఛాన్స్. జూలై సెషన్లో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు ఫారమ్ను పూరించవచ్చు. అధికారిక వెబ్సైట్ ignou.ac.in ద్వారా అప్లై చేసుకోవాలి.
నీట్ పేపర్ లీక్ వ్యవహారం పార్లమెంట్ను కుదిపేయనుంది. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై చర్చించేందుకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నీట్ వివాదంపై కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని మోదీ ఏం సమాధానం చెబుతారన్నదానిపై ఆసక్తి నెలకొంది.
AP Rains : రానున్న 5 రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో ఈ రెయిన్స్ పడతాయట. అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.
బ్రహ్మ దేవుడి ముఖాన్ని పోలి ఉన్న ఓ డ్రెస్ డిజైన్ నెట్టింట వైరల్గా మారింది. పారిస్ ఫ్యాషన్ వీక్లో ఓ ముద్దుగుమ్మ ఈ డ్రెస్ను ధరించింది. 3D ఎఫెక్ట్తో ఈ డ్రెస్ డిజైన్ చేయడం విశేషం. రాహుల్ మిశ్రా ఈ డ్రెస్ను డిజైన్ చేయగా అతని క్రియేటివిటీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.