author image

B Aravind

Rameshwaram Cafe Blast : రామేశ్వరం కేఫ్‌ బ్లాస్ట్.. కేంద్రం కీలక నిర్ణయం
ByB Aravind

Rameshwaram Cafe Blast : ఇటీవల కర్ణాటక లోని బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌ పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ కు అప్పగించింది.

Hyderabad Metro : పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్
ByB Aravind

Hyderabad Metro Rail : మార్చి 7వ తేదీన ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు సీఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 5.5 కిలోమీటర్ల మార్గంలో ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నూమా వరకు ఈ మెట్రో నిర్మాణం ఉంటుంది. ఇందుకోసం సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా.

Farmers Protest: మరోసారి ఉద్యమం ఉద్ధృతం చేయనున్న రైతులు..
ByB Aravind

రైతు సంఘాల నేతలు మరోసారి ఢిల్లీలో తమ పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు.మార్చి 6న ఢిల్లీలో నిరసన చేయాలని.. అలాగే 10వ తేదీన దేశవ్యాప్తంగా రైల్‌రోకో చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం తమ డిమాండ్లు పరిష్కరించేవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Andhra Pradesh : పదవ తరగతి హాల్‌ టికెట్లు నేటి నుంచి విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ByB Aravind

10th Class Hall Tickets : ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు నుంచి హాల్‌టికెట్లు విడుదల కానున్నాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ www.bse.ap.gov.in నుంచి విద్యార్ధులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా.. మార్చి 18 నుంచి 30 వరకూ పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి.

PM Modi : నేడు తెలంగాణకు రానున్న మోదీ.. పలు అభివృద్ధి ప్రాజెక్టులను శంకుస్థాపన
ByB Aravind

PM Modi : ప్రధాని మోదీ ఈరోజు(సోమవారం) తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈరోజు ఆదిలాబాద్‌.. అలాగే రేపు సంగారెడ్డికి ప్రధాని వెళ్లనున్నారు. ఈ రెండు జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ByB Aravind

Road Accident : వనపర్తి జిల్లా కొత్తపేట వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

Exercise : వ్యాయామం చేస్తే మగవారి కన్నా ఆడవారికే ఎక్కువ ప్రయోజనం..
ByB Aravind

Exercise : వ్యాయామం చేస్తే ఎవరికైనా మంచిదే. కానీ ఇది మగవారి కంటే ఆడవారికే ఎక్కువ మేలు చేస్తుందట. చూడటానికి ఇది ఆశ్యర్యంగా అనిపించినా ఇదే నిజం. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో ఇది బయటపడింది.

Israel-Hamas: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సిద్ధం.. అమెరిక ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు
ByB Aravind

Israel-Hamas War: హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిచిపెట్టేందుకు ఒప్పుకుంటే.. ఆరువారాల పాటు కాల్పుల విరమణ చేసేందుకు ఇజ్రాయెల్‌ సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

India-China: భారత మీడియాపై చైనా ఆగ్రహం.. కారణం ఏంటంటే
ByB Aravind

ఇటీవల తైవాన్‌ విదేశాంగ శాఖ మంత్రి జోసఫ్‌ వూ ఇంటర్వ్యూను భారత మీడియా ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన చైనా భారత మీడియా ఫేక్‌ న్యూస్‌ను వ్యాప్తి చేస్తోందని.. తైవాన్ స్వాతంత్ర్యానికి వేదికను కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్‌ తమలో అంతర్భాగమేనని తెలిపింది.

Telangana : కిడ్నాప్‌ అయిన 9 నెలల చిన్నారి సేఫ్.. నిందితురాలు అరెస్టు..
ByB Aravind

9 Months Old Child Kidnapped : హైదరాబాద్‌లోని చంచల్‌గూడలో కిడ్నాప్ అయిన పాపను పోలీసులు రక్షించారు. ఆ చిన్నారి ఇంట్లో కేర్‌టేకర్‌గా చేరిన షాజహాన్ అనే మహిళ.. ఆ పాప తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ఎత్తుకెళ్లింది. ఎంజీబీఎస్‌లో జహీరాబాద్‌ బస్సు ఎక్కిన ఆమెను పోలీసులు పట్టుకుని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.

Advertisment
తాజా కథనాలు