author image

B Aravind

India-China: భారత మీడియాపై చైనా ఆగ్రహం.. కారణం ఏంటంటే
ByB Aravind

ఇటీవల తైవాన్‌ విదేశాంగ శాఖ మంత్రి జోసఫ్‌ వూ ఇంటర్వ్యూను భారత మీడియా ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన చైనా భారత మీడియా ఫేక్‌ న్యూస్‌ను వ్యాప్తి చేస్తోందని.. తైవాన్ స్వాతంత్ర్యానికి వేదికను కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్‌ తమలో అంతర్భాగమేనని తెలిపింది.

Telangana : కిడ్నాప్‌ అయిన 9 నెలల చిన్నారి సేఫ్.. నిందితురాలు అరెస్టు..
ByB Aravind

9 Months Old Child Kidnapped : హైదరాబాద్‌లోని చంచల్‌గూడలో కిడ్నాప్ అయిన పాపను పోలీసులు రక్షించారు. ఆ చిన్నారి ఇంట్లో కేర్‌టేకర్‌గా చేరిన షాజహాన్ అనే మహిళ.. ఆ పాప తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ఎత్తుకెళ్లింది. ఎంజీబీఎస్‌లో జహీరాబాద్‌ బస్సు ఎక్కిన ఆమెను పోలీసులు పట్టుకుని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.

Andhra Pradesh: ఫొటోగ్రాఫర్‌ను హత్య చేసిన షణ్మఖ్.. కారణం ఇదే
ByB Aravind

విశాఖపట్నంలోని మధురవాడ బక్కన్నపాలెంకు చెందిన ఫొటోగ్రఫర్ సాయి విజయ్‌(23)ను షణ్ముఖ్ తేజ్(19) హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. రూ.15 లక్షల విలువైన కెమెరాల కోసం ఈ హత్య జరిగినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న షణ్ముఖ్‌ను పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

Telangana : ఆ స్థానాల్లో బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థులుగా వినోద్, కొప్పుల ఈశ్వర్
ByB Aravind

BRS Party : మాజీ సీఎం కేసీఆర్‌ఈరోజు మధ్యాహ్నం .. బీఆర్‌ఎస్‌ భవన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా వినోద్‌ కుమార్‌, పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్‌ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌ల పేర్లు ఖరారు చేయనున్నట్లు సమాచారం.

Farmers : రైతులకు శుభవార్త.. మరో పదిరోజుల్లో రైతుబంధు పంపిణీ పూర్తి చేసేలా రేవంత్‌ ఆదేశం..
ByB Aravind

Rythu Bandhu : 10 రోజుల్లో రైతుబంధు నిధుల పంపిణీ పూర్తి చేయాలని ఆర్థికశాఖ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. ఇప్పటివరకు 4 ఎకరాల్లోపు ఉన్నవారికి మాత్రమే రైతుబంధు డబ్బులు రావడంతో అయోమయం నెలకొంది. ఇక ఖరీఫ్‌ నుంచి రైతుభరోసా పథకం అమలు చేయనుంది కాంగ్రెస్‌ సర్కార్.

Finger Prints : అద్భుతం.. క్షణాల్లో వేలిముద్రలను గుర్తించే స్ప్రే..
ByB Aravind

Finger Prints : చైనాలోని షాంఘై నార్మల్‌ యూనివర్సిటీ, బ్రిటన్‌లోని బాత్‌ యూనివర్సిటీ పరిశోధకులు కొత్తగా ఓ ఫ్లోపిసెంట్‌ స్ప్రేను అభివృద్ధి చేశారు. ఈ స్ర్పే చల్లిన కొన్ని సెకన్లలోనే వేలి ముద్రలు ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల ఫొరెన్సిక్‌ నిపుణుల దర్యాప్తు.. మరింత సులభంగా, వేగంగా జరిగిపోతుంది.

EVMs: ఈవీఎంలపై భయాందోళనలు అనవసరమన్న ఎన్నికల కమిషనర్‌..
ByB Aravind

ఈవీఎంల వినియోగంపై భయాందోళన అవసరమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. ఒకరికి బదులు మరొకరు ఓట్లు వేయడంపై దృష్టి సారించాలని.. యంత్రంగానికి సూచనలు చేసినట్లు పేర్కొన్నారు.

Hyderabad: మరో పదేళ్లపాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండాలి.. ఏపీ హైకోర్టులో పిల్‌
ByB Aravind

ఏపీ విభజన చట్టం-2014 నిబంధనలు అమలు కాకపోవడంతో.. హైదరాబాద్‌ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచుతూ చట్టం తీసుకొచ్చేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ.. ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.

Ashwini Vaishnaw : డ్రైవర్‌ క్రికెట్‌ చూస్తూ రైలు నడపడంతోనే ప్రమాదం: అశ్వినీ వైష్ణవ్‌
ByB Aravind

Train Accident : గతేడాది విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనపై కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పందించారు . లోక్‌పైలెట్‌, సహాయ లోకోపైలెట్‌లు తమ సెల్‌ఫోన్‌లో క్రికెట్‌ చూస్తూ రైలు నడపడంతోనే రెండు రైళ్లు ఢీకొన్నట్లు తెలిపారు. ఇప్పుడు రైల్వేలో కొత్త భద్రతా చర్యలు తీసుకొచ్చామన్నారు.

EX MLA Saidi Reddy: బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి..!
ByB Aravind

బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈయనను బీజేపీ నుంచి నల్గొండ పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు