Telangana : వరంగల్లో దారుణం.. ప్రియురాలి తల్లిదండ్రులను కిరాతకంగా చంపి..

వరంగల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని కక్ష గట్టిన ప్రియుడు.. అర్ధరాత్రి ప్రియురాలి కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ప్రియురాలి తల్లిదండ్రులు మృతి చెందగా, ఆమె సోదరుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
Telangana : వరంగల్లో దారుణం.. ప్రియురాలి తల్లిదండ్రులను కిరాతకంగా చంపి..

Warangal : వరంగల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహాన్ని (Love Marriage) కాదని అన్నందుకు ఓ యువకుడు ఉన్మాదిగా మారి ప్రేమించిన యువతి తల్లిదండ్రులను హత మార్చాడు (Brutally Killed). ఈ ఘటన చెన్నరావుపేట మండలం చింతల తండాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గిర్నిబాయికి చెందిన నాగరాజు, చింతలతండా దీపిక ఇద్దరూ తల్లి దండ్రులకు తెలియకుండా ప్రేమవివాహంచేసుకున్నారు. ఈ జంట మూడు నెలల పాటు సహజీవనం (Living Relationship) చేసారు. ఆ తర్వాత దీపికా తల్లి దండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

Also Read : అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడి ఆత్మహత్య

దీంతో పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఆ యువతిని తల్లిదండ్రులతో పంపించారు. దీంతో దీపిక కుటుంబంపై కక్ష పెంచుకున్న నాగరాజు.. అర్ధరాత్రి దీపిక కుటుంబంపై తల్వార్‌తో విచక్షణరహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో దీపిక తల్లి బానోతు సుగుణ అక్కడిక్కడే మృతి చెందగా.. గాయపడ్డ ఆమె తండ్రి బానోతు శ్రీనివాస్‌ను వరంగల్‌ MGMకి తరలించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి సైతం మృతి చెందాడు. దీపిక, తమ్ముడు మదన్‌ నర్సంపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Advertisment
తాజా కథనాలు