AP Politics: ఏపీలో అధికార పార్టీ చేస్తున్న అరాచకాలపై యుద్దం ప్రకటించాయి టీడీపీ(TDP), జనసేన(Janasena) పార్టీలు. జగన్(Jagan) చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలన పై ఉమ్మడి పోరుకు సిద్దం అయ్యాయి. జనసేన, టీడీపీ రాష్ట్ర స్థాయి 2వ ఉమ్మడి సవన్వయ కమిటీ సమావేశం విజయవాడలో ఈ రోజు జరిగింది. టీడీపీ నుండి ఆరుగురు సభ్యులు, జనసేన నుండి ఆరుగురు సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్తో(Lokesh) పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu), జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) రెండు పార్టీల నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా గత నెల 23న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటిని ఏ విధంగా ఉమ్మడిగా నిర్వహించామనే అంశంపై రెండు పార్టీల నేతలు మొదటగా చర్చించారు. ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన సమావేశాలకు మంచి స్పందన వచ్చిందని ఇరు పార్టీల నేతలు చెప్పారు.
పూర్తిగా చదవండి..Atchannaidu: ప్రతీ 15 రోజులకు ఒక సమస్యపై ఉద్యమం.. అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన
ఇకపై ప్రతీ 15 రోజులకు ఒక సమస్యపై ఉద్యమిస్తామని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. మేనిఫెస్టోలో భవిష్యత్తుకు గ్యారంటీకు అదనంగా జనసేన పథకాలను జతపరచనున్నట్లు ప్రకటించారు. విజయవాడలో జనసేన-టీడీపీ 2వ ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
Translate this News: