Terrorist Attack: మరోసారి ఉగ్రదాడి.. ఎక్కడంటే

జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడులు జరిగాయి. సోమవారం కథువా జిల్లాలో మాచేడి ప్రాంతంలో భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

New Update
Terrorist Attack: మరోసారి ఉగ్రదాడి.. ఎక్కడంటే

Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడులు జరిగాయి. సోమవారం భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. కథువా జిల్లాలో మాచేడి ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు జావాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలాఉండగా.. రాజౌరీ వద్ద మాఝకోట్‌ సైనిక శిబిరంపై ఆదివారం తెల్లవారుజామున ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఓ జవాన్ గాయపడ్డారు.

Also Read: నిరుద్యోగులకు షాక్.. మెగా డీఎస్సీ లేదు..

సైనికులు ఎదురుకాల్పులు జరపడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. వీళ్లను పట్టుకునేందుకు సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. మరోవైపు కుల్గామ్ అనే జిల్లాలో రెండురోజులుగా రెండు గ్రామాల్లో తుటాలు పేలుతున్నాయి. ఇప్పటివరకు అక్కడ ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మృతి చెందారు. అందులో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు.

Also read: ఆలయం బయట రాహుల్‌ ఫొటోతో డోర్‌మ్యాట్‌.. వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు