AP News: పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది.. వైసీపీపై వైఎస్ షర్మిల సెటైర్స్!

ఏపీలో వైసీపీ నేతల తీరు పచ్చ కామర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. సాక్షి పత్రికలో తల్లికి వందనం కథనంపై ప్రశ్నించినందుకు కాంగ్రెస్ ను తోక పార్టీ అని కామెంట్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
AP News: పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది.. వైసీపీపై వైఎస్ షర్మిల సెటైర్స్!

YS Sharmila: ఏపీలో వైసీపీ నేతల తీరు పచ్చ కామర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. సాక్షి పత్రికలో (Sakshi Paper) తల్లికి వందనం ఉత్తర్వులపై వచ్చిన వార్తకు చంద్రబాబు (Chandrababu) సమాధానం చెప్పాలని తాము అడిగితే.. బాబుకు కాంగ్రెస్ (Congress) తోక పార్టీ అని ముడి పెట్టడం వైసీపీ అవగాహన రాహిత్యానికి నిదర్శనమంటూ విమర్శలు గుప్పించారు.

అందరికీ పథకం వర్తింప జేయాలి..
వైసీపీ నేతలకు కళ్ళుండి, వినడానికి చెవులు ఉండి, విజ్ఞత కలిగిన వాళ్ళే అయితే.. మేము చెప్పింది ఏంటో ఒకటికి 10 సార్లు వినాలి. తల్లికి వందనం GO 29 క్లారిటీ లేదని, సాక్షి రాసిన వార్తకి వివరణ ఇవ్వాలని, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తింప జేయాలని డిమాండ్ చేస్తే.. కూటమి ప్రభుత్వానికి కొమ్ము గాసినట్లు ఎలా అవుతుంది? మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిలదీశాం కాబట్టే 24 గంటలు దాటకుండా సర్కారు ప్రజలకు వివరణ ఇచ్చుకుంది. ప్రతిపక్షంగా తల్లుల పక్షాన మేము నిలబడితే కాంగ్రెస్ బాబుకి తోక పార్టీ ఎలా అవుతుంది? వైసీపీ నేతలకు బహిరంగ సవాల్. 2019 ఎన్నికల కంటే ముందు జగన్ గారు ఇంట్లో ఇద్దరు బిడ్డలకు ఇస్తామని చెప్పలేదా? ఆ ముక్క పట్టుకొని నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయలేదా? అది మీరు నిలబెట్టుకున్నారా? నిలువునా మోసం చేశారా? అది ప్రజలు మీకిచ్చిన తీర్పే చెబుతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలా ప్రచారం చేయించడం నిజం కాదా?
అలాగే ఆ రోజు తన చేత ఊరూరా, ప్రతిచోటా ప్రచారం చేయించడం నిజం కాదా? అని ప్రశ్నించారు. 'నేను వైసీపీ కోసం బై బై బాబు కాంపెయిన్ చేయడం ఎంత నిజమో అమ్మ ఒడి కింద ఇద్దరు బిడ్డలకు 15000 రూపాయిలు చొప్పున, ప్రతి తల్లికి ఇస్తాం అని ప్రచారం చేయడం కూడా అంతే నిజం. మరి మీకు 15000 ప్రతిబిడ్డకు ఇచ్చే ఉద్దేశమే లేకపోతే నా చేత ఎందుకు అలా ప్రచారం చేయించారు? మీరు కూడా ఎందుకు కాంపెయిన్ చేశారు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని.. జలయజ్ఞం పూర్తి చేస్తామని.. ప్రత్యేక హోదా సాధిస్తాం అని ఎందుకు కాంపెయిన్ చేయించారు? మీరు కూడా ఎందుకు కాంపెయిన్ చేశారు? బహిరంగ చర్చకు మీరు సిద్ధమా? అంటై సవాల్ విసిరారు.

Also Read: ఐదు యూట్యూబ్‌ ఛానళ్లను రద్దు చేయించిన ‘మా’!

Advertisment
తాజా కథనాలు