Road Accident : అమెరికా రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎమ్మెల్యే బంధువులు మృతి

అమెరికాలో టెక్సాస్ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఏపీకి చెందిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు ఐదుగురు దుర్మరణం చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

New Update
Road Accident : అమెరికా రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎమ్మెల్యే బంధువులు మృతి

Road Accident - America : అమెరికా(America) లోని రోడ్డు ప్రమాదం(Road Accident) తీరని విషాదాన్ని మిగిల్చింది. టెక్సాస్(Texas) హైవేలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ఆమలాపురం(Amalapuram) వాసులు మృతి చెందారు. టెక్సాస్ నుంచి డల్లాస్ వెళుతుండగా ప్రమాదం సంభవించింది. ఇందులో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. వీరంతా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివర్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులని సమాచారం.

Also read:నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్ బాటలోనే అమెజాన్ ప్రైమ్

ఎమ్మెల్యే సతీష్ చిన్నాన్న నాగేశ్వర్రావు, ఆయన బార్య, కుమార్తె, మనువడు, మనువరాలు మరో బంధువు అక్కడిక్కడే చనిపోయారు. నాగేశ్వర్రావు అల్లుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయన పరిస్థితి విషమంగానే ఉంది. టెక్సాస్ హైవేలోని జాన్స్న్ కౌంటీ దగ్గర నాగేశ్వర్రావు వెళుతున్న కారును రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీకొట్టాయని అక్కడి పోలీసులు చెబుతున్నారు.

Also Read : హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి!

Advertisment
తాజా కథనాలు