MINISTER LOKESH : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా డిఎస్సీ (Mega DSC) ని ఎటువంటి విమర్శలకు తావీయకుండా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అధికారులను ఆదేశించారు. టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. టెట్ నోటిఫికేషన్ విడుదల, మెగా డీఎస్సీ నేపథ్యంలో అధికారులతో పలు అంశాలపై చర్చించారు.
పూర్తిగా చదవండి..AP Mega DSC : మెగా డీఎస్సీలో సిలబస్ మార్పు.. మంత్రి లోకేష్ ఏమన్నారంటే!
ఎలాంటి విమర్శలకు తావీయకుండా మెగా డీఎస్సీ నిర్వహించాలని ఏపీ విద్యశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సిలబస్ లో ఎటువంటి మార్పులు చెయ్యలేదన్నారు. 2024 ఫిబ్రవరి సిలబస్ తోనే డీఎస్సీ నిర్వహిస్తామని, తప్పుడు ప్రచారం నమ్మొద్దన్నారు.
Translate this News: