Jagan : విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు.. రేపటి నుంచే పంపిణీ!

8వ తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి ట్యాబ్‌లు అందించనుంది. 10 రోజుల పాటు ఈ ట్యాబ్‌ల పంపిణీ జరగనుండగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో జగన్‌ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ట్యాబ్‌ల పంపిణీతో ప్రతి విద్యార్థికి రూ. 33,000 లబ్ధి చేకురనుంది.

New Update
Jagan : విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు.. రేపటి నుంచే పంపిణీ!

Free Tabs For Students : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకు రూ. 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్‌లను ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రేపు(డిసెంబర్ 21) అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్‌(CM Jagan) లాంఛనంగా ప్రారంభించనున్నారు. దాదాపు రూ.17,500కు పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్ దాదాపు రూ.15,500 విలువ గల బైజూస్ కంటెంట్‌తో కలిపి ప్రతి 8వ తరగతి విద్యార్థికి రూ. 33,000 లబ్ధి చేకురేలా ఈ కార్యక్రామనికి శ్రీకారం చుట్టనున్నారు జగన్‌.

ప్రస్తుతం అందిస్తున్న 4,34,185 ట్యాబులతో కలిపి ఇప్పటివరకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, బోధిస్తున్న ఉపాధ్యాయులకు రూ.1.305.74 కోట్లవ్యయంతో 9,52,925 ట్యాబులు(TABS) అందించినట్టు లెక్కలు చెబుతున్నాయి. 8వ తరగతి విద్యార్థులు పై తరగతులకు వెళ్లినప్పుడు కూడా ఉపయోగపడేలా 8వ తరగతితో పాటు 9,10 తరగతుల బైజూస్ కంటెంట్ లోడ్ చేసి ట్యాబ్ లు అందించనున్నారు. రేపటి నుంచి అందించనున్న ట్యాబ్‌లలో 11,12 తరగతుల కంటెంట్ కూడా లోడ్ చేసేలా ట్యాబ్ మెమరీ కార్డ్ సామర్థ్యం 256GB కి పెంచి మరీ అందించనుంది ప్రభుత్వం.

Also Read: ‘అమిత్‌షా ఒప్పుకుంటారో లేదో తెలియదు..’ పొత్తులపై పవన్‌ కామెంట్స్!

దాదాపు అన్ని సబ్జెక్టులు ఉంటాయ్:
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, టోఫెల్ ప్రిపరేషన్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా అన్ని ట్యాబ్‌ల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బాట్ (డౌట్ క్లియరెన్స్ బాట్) అప్లికేషన్.. పిల్లలు సులభంగా విదేశీ భాషలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందేందుకు వీలుగా డ్యులింగో (DUOLINGO) ఇన్ స్టాల్ చేసి ఉంది.

ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్లో కూడా పని చేసేలా ఏర్పాటు:

4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి ఉచితంగా అందిస్తున్న రూ.15,500 విలువైన బైజూస్ కంటెంట్ ఇక 11, 12వ తరగతులకు కూడా ఇవ్వనున్నారు. దీనిద్వారా 34.3 లక్షల మంది విద్యార్థులకు కంటెంట్ రూపేణా లబ్ధి చేకురనుంది. మెమరీ కెపాసిటీ పెంచడంతో పాటు ట్యాబ్ సంరక్షణ కోసం రగ్డ్ కేస్, టెంపర్డ్ గ్లాస్ లాంటివి ఉండనున్నాయి. ట్యాబ్‌లలో అవాంఛనీయ సైట్లు, యాప్స్‌ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఇన్‌స్టాల్‌ అయ్యి ఉంది. ట్యాబ్‌కు 3 ఏళ్ళ పాటు సంపూర్ణ వారంటీ ఉంటుంది. ఏదైనా సమస్య తలెత్తితే సమీపంలోని సచివాలయాల్లో లేదా హెడ్మాస్టర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ.. విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్.. 45 వేల స్మార్ట్ టీవీలు ఉండనున్నాయి.

ఐఎఫ్ పీలు, స్మార్ట్ టీవీలు, ఇంటర్నెట్:
డిజిటల్ విధానంలో బోధనకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి, ఆపైన ప్రతి తరగతి గదిలో ఆన్లైన్ తో పాటు ఆఫ్ లైన్లో కూడా పని చేసేలా బైజూస్ కంటెంట్, ఏపీ ఎస్ఈఆర్ టి తయారు చేసిన ఈ-కంటెంట్ తో కూడిన 62వేల ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్.. 1-5 తరగతులకు ప్రతి స్కూల్లో ఒకటి చొప్పున దాదాపు 45 వేల స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులకు డిజిటల్ మౌలిక వసతులు మరింత మెరుగుపరుస్తూ రాష్ట్రవాప్తంగా దాదాపు 45వేల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఫైబర్/ బ్రాడ్ బాండ్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.

ఇంగ్లీషు మీడియం విద్య- సీబీఎస్ఈ మొదలు ఐబీ దాకా అడుగులు:
పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు, వారిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన,.. సీబీఎస్ఈ మొదలు ఐబీదాకా అడుగులు వేస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ లో నైపుణ్యం సాధించేలా ఈ ఏడాది ఇప్పటికే టోఫెల్‌ను జగన్‌ ప్రభుత్వం ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టింది.

Also Read: తెలుగు కుర్రాడికి షాక్‌.. మూడో వన్డే నుంచి ఔట్.. తుది జట్టు ఇదే!

WATCH:

Advertisment
తాజా కథనాలు