Andhra Pradesh: ఏపీ ఇంటర్ విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త!

ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చాక చాలా మార్పులు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా విద్యాశాఖ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా జూనియర్ రాలేజీ విద్యార్ధులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు ఇస్తున్నారు.

New Update
Andhra Pradesh: ఏపీ ఇంటర్ విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త!

వేసవి సెలవులు అయిపోయాయి. స్కూళ్ళు, కాలేజీలు అన్నీ తెరుచుకున్నాయి. సూల్ విద్యార్ధులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగులను ఇంతకు ముందే నుంచి ఇస్తున్న గవర్నమెంటు ఇప్పుడు జూనియర్ కాలేజీ విద్యార్ధులకు ఫ్రీగా నోట్ పుస్తకాలు, బ్యాగ్‌లనూ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేజీబీవీలు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు, హైస్కూల్లోల ప్లస్ టూ చదివే విద్యార్ధులకు తెలుగు అకాడమీ ద్వారా ఇవన్నీ ఇస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ పథకానికి నోడల్ అధికారిగా సమగ్ర శిక్ష డైరెక్టర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం.

Also Read:T20 world Cup: టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్? ఉగాండా ప్లేయర్‌తో మంతనాలు

Advertisment
తాజా కథనాలు