Posani Krishna Murali: తన కులపోడు కాబట్టే మద్దతు.. జేపీపై పోసాని ఫైర్

జయప్రకాష్ నారాయణ ఎన్డీయేకు మద్దతు ఇవ్వడంపై ఫైర్ అయ్యారు పోసాని. చంద్రబాబు తమ కులానికి చెందిన వాడు కాబట్టి జేపీ మద్దతు ఇచ్చారని ఆరోపించారు. మేధావి ముసుగు వేసుకున్న జేపీని ప్రజలు నమ్మొద్దని అన్నారు.

New Update
Posani Krishna Murali: తన కులపోడు కాబట్టే మద్దతు.. జేపీపై పోసాని ఫైర్

Posani Krishna Murali: ఎన్డీయే కూటమికి లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ మద్దతు ఇవ్వడంపై ఘాటుగా స్పందించారు నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి. తమ కులానికి చెందిన వాడు కాబట్టి చంద్రబాబుకు జేపీ మద్దతు ఇచ్చారని ఆరోపించారు. అవినీతిపరుడైన చంద్రబాబుకు జీపీ మద్దతివ్వడం సిగ్గు చేటు అని ఫైర్ అయ్యారు. 2014-19 మధ్య చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు దోచుకున్నారని విమర్శించారు.

ALSO READ: జగన్‌ను దెబ్బకొట్టేలా చంద్రబాబు పర్యటనలు

సీఎం జగన్‌ పాలనలో జరిగిన అభివృద్ధి జేపీకి కనిపించడం లేదా? అని జయప్రకాష్ నారాయణను నిలదీశారు. మేధావి ముసుగు వేసుకున్న జేపీని ప్రజలు నమ్మొద్దని అన్నారు. వంగవీటి రంగాను చంపించిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేస్తే రాష్ట్రం నాశనమే అని జోస్యం చెప్పారు. కమ్మకులానికి చెందిన వాడైనా వెధవలకు నేను సపోర్ట్‌ చేయను అని తేల్చి చెప్పారు. ఎన్నికల ముందు జేపీ చేత చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా ఇది అని అన్నారు. బాబు మోసాలను గమనించే జగన్‌కు ప్రజలు 151 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేస్తే రాష్ట్రం నాశనమే అని అన్నారు.

సంక్షేమం కోసమే..

రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపారు లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ. సంక్షేమం, అభివృద్ధి సమతూకాన్ని పాటించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయా?అనే అనుమానం ఉందని పేర్కొన్నారు. ఆర్థిక భవిష్యత్తు కాపాడే వారు ఎవరని ప్రజలు ఆలోచించాలని హితవు పలికారు. సామాన్యుల జీవితాలు మారాలంటే అభివృద్ధి చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు.

Advertisment
తాజా కథనాలు