TDP Chief Chandrababu: ఎన్నికల వేళ ఏపీలోని మందుబాబులకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అమ్ముతామని హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా చిప్ లిక్కర్ అమ్ముతుందని ఫైర్ అయ్యారు. ఈరోజు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. మహిళలతో ఏర్పాటు ఏర్పాటు చేసిన ముఖాముఖీలో కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.60 ఉన్న మద్యాన్ని జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకంగా రూ.200 లకు పెంచిందని మండిపడ్డారు. టీడీపీకి ఓటు వేస్తేనే భర్తలకు అన్నం పెట్టాలని పిలుపునిచ్చారు. ఏపీలో నాసిరకం మద్యం అమ్ముతూ.. ఆడబిడ్డల మగళసూత్రాలను తెంచేస్తున్నారని వైసీపీ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాగానే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. జే బ్రాండ్ మద్యం ఎందుకు పెట్టారో సీఎం జగనే సమాధానం చెప్పాలని అన్నారు. కుప్పంలోరాళ్లు, మట్టిని కూడా జగన్ సర్కార్ వదలడం లేదని విమర్శించారు. ఏపీలో జగన్ పాలన అంతం కావాలంటే లక్ష మెజారితో కుప్పంలో తనను గెలిపించాలని కోరారు.
ALSO READ: అందరిని గుర్తుపెట్టుకుంటాం.. వైసీపీ నేతలకు లోకేష్ హెచ్చరికలు