ఆప్కాబ్ రైతులకు అందించిన సేవలు విశేషమైనవని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలోని కన్వెన్షన్ సెంటర్ లో ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర సహకార రంగం చరిత్రలో ఆప్కాబ్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆప్కాబ్ తన 60 ఏళ్ల ప్రయాణంలో రైతులకు అండగా నిలబడిందన్నారు. రైతు అప్పుల్లోనే పుడతాడు.. అప్పుల్లోనే బతుకుతాడు చివరికి అప్పుల్లోనే చనిపోతాడన్న ఓ నానుడి ఉండేదని, కానీ బ్యాంకింగ్ వ్యవస్థ రైతులకు దగ్గరకు అడుగులు వేడయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆప్కాబ్ ను నిలబెట్టడంలో కీలక పాత్ర వహించారని కొనియాడారు. ఆప్కాబ్ లో వైఎస్సార్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. ఆప్కాబ్ సేవలన్నీ మరింతగా విస్తరిస్తున్నాయన్నారు. ఆర్బీకే స్థాయిలోనే రుణాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. ఆర్బీకేలు రైతుల చేయి పట్టుకుని నడిస్తున్నాయని, ఆర్బీకేలను ఆప్కాబ్ తో అనుసంధానం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. దేశ చర్రితలోనే ఆప్కాబ్ కు మంచి గుర్తింపు ఉందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చూస్తామని తెలిపారు సీఎం జగన్.
పూర్తిగా చదవండి..ఇలాగే కాదు, ఇంకా ఆప్కాబ్ ను మెరుగుపరుస్తాం : ఏపీ సీఎం జగన్
రాష్ట్ర సహకార రంగం చరిత్రలో ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. ఆప్కాబ్ షష్టిపూర్తి జరుపుకుంటోందని.. 60 ఏళ్ల ప్రయాణంలో ఆప్కాబ్ రైతులకు అండగా నిలబడిందన్నారు. భారత రైతు అప్పుల్లోనే పుడతాడు.. అప్పుల్లోనే బతుకుతాడు చివరికి అప్పుల్లోనే చనిపోతడాని ఓ నానుడి ఉండేదని.. కానీ బ్యాంకింగ్ వ్యవస్థ రైతులకు దగ్గరకు అడుగులు వేడయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆప్కాబ్ ను...
Translate this News: