Telangana: హైదరాబాద్కు చేరుకున్న చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు చేరుకున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఏపీ సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి నగరానికి వచ్చారు. రేపు ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్న సంగతి తెలిసిందే. By B Aravind 05 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు చేరుకున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న అనంతరం ఆయన హైదరాబాద్కు చేరుకున్నారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి నగరానికి వచ్చిన వేళ.. పార్టీ నేతలు ప్రత్యేక ఏర్పాట్ల చేశారు. వాహనంపై నుంచి చంద్రబాబు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. భారీ వర్షం కురుస్తున్న కూడా లెక్కచేయకుండా అభిమానులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. Also read: తీహార్ జైలులో కవితతో కేటీఆర్, హరీష్ ములాఖాత్ ఇదిలా శనివారం సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో.. చంద్రబాబు భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీళ్ల సమావేశం కోసం ప్రజాభవన్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్న అంశాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకేచోట కలిసి భేటీ అవ్వడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా షెడ్యూల్ 9, 10లో ఉన్న విభజన అంశాలపైనే ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. Also read: ఎర్రచందనం స్మగ్లింగ్ పై పవన్ స్పెషల్ ఫోకస్.. పెద్ద తలకాయలే టార్గెట్! #telugu-news #cm-revanth-reddy #chandra-babu-naidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి