/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/turkey-jpg.webp)
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సంభవించిన భూకంపం నుండి టర్కీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అంతలోనే మరో బలమైన భూకంపం సంభవించింది. గురువారం రాత్రి సంభవించిందిన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదు అయ్యింది. ఈ భూకంప ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయి. చాలా మంది గాయపడ్డారని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
An earthquake of magnitude 5.2 struck eastern Turkey, the European Mediterranean Seismological Centre said: Reuters
— ANI (@ANI) August 11, 2023
Magnitude 5.5 earthquake hits Malatya, Turkey: EMSC pic.twitter.com/1A19qUarGM
— Jack Straw (@JackStr42679640) August 11, 2023
భూకంప కేంద్రం మలత్య ప్రావిన్స్లోని యెస్లుర్ట్ నగరంలో ఉంది. అడియామాన్లో భూకంపం సంభవించింది. ఫిబ్రవరిలో సంభవించిన భారీ భూకంపం వల్ల రెండు ప్రావిన్స్లు ప్రభావితమయ్యాయని, ఇందులో 50,000 మందికి పైగా మరణించారు. మాలత్యా, అడియామాన్లో భవనాలు కూలిపోవడంతో ప్రజలు గాయపడ్డారని టర్కీ ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా సోషల్ మీడియా పోస్ట్లో తెలిపారు.
అటు జపాన్ లోనూ భూమి కంపించింది. జపాన్లోని హక్కైడోలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ సమాచారాన్ని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) శుక్రవారం అందించింది. భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుంచి 46 కి.మీ (28.58 మై) దిగువన ఉన్నట్లు GFZ తెలిపింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
An earthquake of magnitude 6.0 strikes Hokkaido in Japan, German Research Centre for Geosciences (GFZ) said: Reuters
— ANI (@ANI) August 11, 2023
ఇక అండమాన్ నికోబార్ దీవుల్లో అర్థరాత్రి భూమి కంపించింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
An earthquake of magnitude 4.3 hits Andaman and Nicobar Island: National Center for Seismology pic.twitter.com/740gUCeMcu
— ANI (@ANI) August 10, 2023